News March 29, 2025

వికారాబాద్: జిల్లాలో 92% ఇంటి పన్ను వసూలు

image

వికారాబాద్ జిల్లాలో 92 శాతం ఇంటి పన్నులు వసూలయ్యాయి. నేటి వరకు కోట్ పల్లి, వికారాబాద్, బంట్వారం మండలాలలో 100% వసూలు అయినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 20 మండలాల్లో కేవలం మూడు మండలాల్లోనే 100% వసూలు కాగా మిగతా 17 మండలాల్లో 85 నుంచి 90 శాతం పైగా వసూలు అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇంటి పన్ను వసూలుకు మార్చి 31తో గడువు ముగియనుంది.

Similar News

News October 23, 2025

విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం కృషి: కలెక్టర్

image

ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ, విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. భీమారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, తరగతి గదులు, వంటశాల, మధ్యాహ్న భోజనం నాణ్యత, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలని సూచించారు.

News October 23, 2025

ఓయూలో రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ ఎంసీఏ పరీక్షల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 27వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున చెల్లించి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 23, 2025

ఓయూలో రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ ఎంసీఏ పరీక్షల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎంసీఏ మెయిన్, బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఒక్కో పేపర్‌కు రూ.800 చొప్పున చెల్లించి ఈనెల 27వ తేదీలోగా, రూ.200 అపరాధ రుసుముతో 29వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. జవాబు పత్రాల నకలు పొందేందుకు ఒక్కో పేపర్‌కు రూ.1,000 చొప్పున చెల్లించి 27 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.