News February 21, 2025
వికారాబాద్ జిల్లా నేటి టాప్ న్యూస్

✓ పోలేపల్లి ఎల్లమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్,ఎస్పీ.✓అభివృద్ధి పనులు ప్రారంభించిన స్పీకర్.✓ మహా కుంభమేళకు హాజరైన చేవెళ్ల ఎంపీ దంపతులు.✓ బషీరాబాద్ అమ్మాయికి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్.✓ పరిగి,పెద్దెముల్ నుంచి శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరిన శివ స్వాములు.✓ రేపు పోలేపల్లి రానున్న సీఎం రేవంత్ రెడ్డి..భద్రత ఏర్పాట్లు పరిశీలించిన మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ.
Similar News
News November 21, 2025
హారతిని కళ్లకు అత్తుకుంటున్నారా?

చాలామంది హారతిని కళ్లకు అత్తుకుంటారు. అయితే ఇలా చేయకూడదని పండితులు చెబుతున్నారు. దేవుడికి దిష్టి తీయడం కోసమే హారతి ఇస్తారని, దాన్ని కళ్లకు అత్తుకోకూడదని సూచిస్తున్నారు. ‘ఇంట్లో, చిన్న పిల్లలకు చెడు దృష్టి తగలకుండా దిష్టి తీసినట్లే స్వామివారికి దృష్టి దోషం పోవడానికే హారతి ఇస్తారు. అందులో ఏ సానుకూల శక్తి ఉండదు. దిష్టి తీసిన గుమ్మడికాయను వదిలేసినట్లే హారతిని కూడా వదిలేయాలి’ అని వివరిస్తున్నారు.
News November 21, 2025
RRB-NTPC ఫలితాలు విడుదల

RRB-NPTC 3,445 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి సీబీటీ 1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టినతేదీ ఎంటర్ చేసి https://indianrailways.gov.in/లో ఫలితాలు తెలుసుకోవచ్చు. మొత్తం 27.55లక్షల మంది పరీక్ష రాయగా.. 51,979మంది సీబీటీ 2కు అర్హత సాధించారు.
News November 21, 2025
వేములవాడ రాజన్న ఆలయానికి రికార్డ్ ఆదాయం

వేములవాడ రాజన్న ఆలయానికి కార్తీకమాసం సందర్భంగా రికార్డ్ స్థాయి ఆదాయం సమకూరింది. అక్టోబర్ 22 నుంచి నవండర్ 20 వరకు ఆర్జిత సేవలు, ఇతర టికెట్ల ద్వారా రూ.4,00,06,720, హుండీల లెక్కింపు ద్వారా రూ.4,22,60,841 ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం ఆదాయం 8 కోట్ల 22 లక్షల 67 వేల 561 రూపాయల లభించినట్లు వివరించారు.


