News January 30, 2025
వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యంశాలు

✓ జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు.✓ కోట్పల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ నారాయణరెడ్డి.✓ కొడంగల్లో కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.✓ దుద్యాల మండలంలో నూతన ఎంపీడీవో కార్యాలయం ప్రారంభం.✓ ప్రభుత్వం హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీజీకి వినతి పత్రాలు.✓ కొడంగల్లో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్కు పోలీసుల గౌరవ వందనం.
Similar News
News November 22, 2025
కృష్ణా: చోరీ అనుమానితుల ఫొటోలు విడుదల..!

మచిలీపట్నం మాచవరం సమీపంలోని పాత తౌడు ఫ్యాక్టరీ వద్ద రెండు రోజుల కిందట రెండు ఇళ్లలోకి చోరీకి పాల్పడిన నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వీరు ఎక్కడ కనిపించినా వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ 8332983789కు సమాచారం ఇవ్వాలని చిలకలపూడి సీఐ కోరారు. వీరిద్దరూ బైక్పై తిరుగుతుంటారని తెలిపారు.
News November 22, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలి: DYFI

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా శిక్షణ ప్రారంభించకపోవడంపై DYFI మండిపడింది. దీనివల్ల అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది. 6,100 మందికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. ఈ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా లీగల్ సమస్యలతో ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్లో మెయిన్స్ నిర్వహించి AUGలో రిజల్ట్స్ ప్రకటించారు.
News November 22, 2025
మెదక్: మరింత పైకి కూరగాయల ధరలు..!

కూరగాయల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తుఫాన్, అకాల వర్షాల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గడం, కార్తీక్ మాసంలో కూరగాయల వినియోగం పెరగడం వంటి కారణాలతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మార్కెట్లలో పాలకూర రూ.120, చిక్కుడు రూ.100, బీరకాయ రూ.100, బెండకాయ రూ.80, వంకాయ రూ.80 పలుకుతున్నాయి. మీ ప్రాంతంలో కూరగాయల ధరలు పెరిగాయా కామెంట్ చేయండి.


