News January 30, 2025
వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యంశాలు

✓ జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాలు.✓ కోట్పల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఎస్పీ నారాయణరెడ్డి.✓ కొడంగల్లో కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.✓ దుద్యాల మండలంలో నూతన ఎంపీడీవో కార్యాలయం ప్రారంభం.✓ ప్రభుత్వం హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీజీకి వినతి పత్రాలు.✓ కొడంగల్లో కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాధ్కు పోలీసుల గౌరవ వందనం.
Similar News
News December 5, 2025
నల్గొండ: ఎన్నికల వేళ.. జోరందుకున్న దావత్లు!

గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి జోరందుకుంది. గురువారం నుంచి మొదటి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. బరిలో ఉన్న అభ్యర్థులు విందు, వినోదాలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో మటన్ కిలో రూ.800 నుంచి రూ.1,000 ధర పలుకుతుండడంతో చికెన్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీంతో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. కిలో చికెన్ రూ.220, స్కిన్ లెస్ కిలో రూ.250 పలుకుతోంది. లిక్కర్ అమ్మకాలూ విపరీతంగా పెరిగాయి.
News December 5, 2025
BREAKING: నల్గొండ: లంచం తీసుకుంటూ దొరికిన డిప్యూటీ MRO

లంచం తీసుకుంటూ ఓ డిప్యూటీ తహశీల్దార్ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. నల్గొండ జిల్లా చండూరు తహశీల్దార్ ఆఫీస్లో డిప్యూటీ MRO రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు ఆయనను ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 5, 2025
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ జానకి షర్మిల

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం డిసెంబర్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా పబ్లిక్ మీటింగ్లు, ర్యాలీలు, ధర్నాలు నిషేధమని స్పష్టం చేశారు. అలాగే ఆయుధాలు, పేలుడు పదార్థాలు, లౌడ్ స్పీకర్లు, డీజేలు వినియోగించడం కూడా నిషేధమని చెప్పారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.


