News February 27, 2025

వికారాబాద్ జిల్లా బుధవారం ముఖ్యంశాలు

image

✓ తాండూర్: భూకైలాస్ జ్యోతిర్లింగాలను దర్శించుకున్న మహారాష్ట్ర మంత్రి.✓ మర్పల్లి: డబ్బుల కోసమే వృద్ధురాలిని హత్య ముగ్గురు నిందితుల అరెస్ట్.✓ దామగుండం,బుగ్గ రామలింగేశ్వర స్వామి,పాంబండ రామలింగేశ్వర స్వామి,గాడిబాయి,భూకైలాస్ శివాలయాలకు పోటెత్తిన భక్తులు. ✓ వికారాబాద్ జిల్లాలో ఘనంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు.✓ మహాశివుని ఆశీస్సులతో ప్రజలు సుభిక్షంగా ఆశీస్సులతో

Similar News

News February 27, 2025

ముగిసిన వంశీ కస్టడీ

image

AP: వైసీసీ నేత వల్లభనేని వంశీ మూడోరోజు పోలీస్ కస్టడీ ముగిసింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో వంశీని పోలీసులు 3 రోజుల పాటు ప్రశ్నించారు. వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించారు. వంశీని మరోసారి కస్టడీకి తీసుకోవాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. దీనిపై త్వరలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

News February 27, 2025

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

image

ఏపీ, తెలంగాణలో MLC ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాల్లో 3 చొప్పున స్థానాలకు ఉ.8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. TGలో ఉమ్మడి MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానానికి, APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. మార్చి 3న కౌంటింగ్ జరగనుంది.

News February 27, 2025

పార్వతీపురం జిల్లాలో 85.60% పోలింగ్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 85.60 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2,333 మంది టీచర్లకు గాను 1,997 మంది ఓటేశారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

error: Content is protected !!