News February 2, 2025
వికారాబాద్ జిల్లా సీపీఎస్ సంఘం నూతన కార్యవర్గం

వికారాబాద్ జిల్లా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం వికారాబాద్లో ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రాజకుమార్, ప్రధాన కార్యదర్శి ఇల్లూరి క్రాంతికుమార్, ఉపాధ్యక్షులుగా నరసింహ రాజు, అసోసియేషన్ ప్రెసిడెంట్గా సుందర్, సంయుక్త కార్యదర్శిగా రవీందర్, కార్యదర్శిగా శ్రీనివాస్, ఈసి మెంబర్స్గా అనిల్, తిరుపతి, రాజారత్నంలను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ గౌడ్ తెలిపారు.
Similar News
News February 26, 2026
బిందు సేద్యం ఆటో మెడిటేషన్ రైతులకు వరం: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన APMIP డ్రిప్ ఇరిగేషన్ ఆటో మెడిటేషన్ పథకానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ శ్యాంప్రసాద్ గురువారం కలెక్టరేట్లో విడుదల చేశారు. జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా చిన్న, సన్నకారు రైతులు 55%, పెద్ద రైతులకు 45% సబ్సిడీ పొందవచ్చన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 14 వేల హెక్టార్లలో డ్రిప్ ఇరిగేషన్ లక్ష్యం కాగా 11,952 హెక్టార్లలో పూర్తి అయిందన్నారు.
News February 26, 2026
ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

ఏలూరు జిల్లావ్యాప్తంగా 56 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 16,357 మంది విద్యార్థులకు గాను 15,972 మంది హాజరుకాగా, 385 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 98 శాతం హాజరు నమోదైందని అధికారులు వెల్లడించారు. ఎక్కడా మాల్ ప్రాక్టీస్ వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పటిష్ట నిఘా ఏర్పాటు చేశాయి.
News February 26, 2026
జనగామ: ఇంటర్ EXAMS.. 76 మంది గైర్హాజరు

జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 3,999 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, వారిలో 3,923 మంది హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాశాఖ నోడల్ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. వివిధ కారణాల వల్ల 76 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షా కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.


