News February 27, 2025
వికారాబాద్: దొంగతనానికి వచ్చి వృద్ధురాలి హత్య

మర్పల్లి మండలంలో వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బుల కోసమే హత్య చేసినట్లు గుర్తించారు. కోటమర్పల్లిలో తోకల వినోద(60) ఒంటరిగా ఉంటుంది. అదే గ్రామానికి చెందిన రాజు, శఫయుద్దీన్, నర్సింహులు.. ఈనెల 23న అర్ధరాత్రి మందు తాగి ఇంట్లో చోరీకి వెళ్లారు. వాళ్లను వినోద గుర్తించగా తమ గురించి తెలుస్తుందని బావించి పక్కనే ఉన్న బావిలో తోసేసి బీరువాలోని రూ.21వేలు ఎత్తుకెళ్లారు. నిందితులను రిమాండ్ చేశారు.
Similar News
News December 3, 2025
సూర్యాపేట: ప్రారంభమైన మూడో విడత నామినేషన్ ప్రక్రియ

జిల్లాలోని ఏడు మండలాలకు సంబంధించిన 146 గ్రామ పంచాయతీ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. డిసెంబర్ 5 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ దశలో సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఈ దశలో మేళ్లచెరువు వంటి పెద్ద గ్రామపంచాయతీలు ఎక్కువగా ఉండటం.. అధిక ఓటర్లు ఉన్న గరిడేపల్లి మండలం ఉండడంతో నామినేషన్లు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
News December 3, 2025
ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆక్టోపస్ ‘మాక్ డ్రిల్’

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కొనేందుకు ఎస్పీ వకుల్ జిందాల్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఆక్టోపస్ డెల్టా టీమ్, గుంటూరు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇందులో పాల్గొన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత, ప్రజా రక్షణ కోసమే దీనిని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
News December 3, 2025
124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(C<


