News February 6, 2025
వికారాబాద్: నవల్గా హత్య కేసు మిస్టరీ చేదన
బషీరాబాద్ మండలం నవల్గా శివారులో జరిగిన వ్యక్తి హత్య కేసును మిస్టరీని పోలీసులు చేధించినట్లు బుధవారం DSP బాలకృష్ణారెడ్డి తెలిపారు. CI నగేష్, SI శంకర్లతో కలిసి వివరాలను వెల్లడించారు. స్థలం, పాత కక్షలతోనే వదిన సుగుణమ్మను ముగ్గురుతో కలిసి హత్య చేయించినట్లు తెలిపారు. కేసులోని నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News February 6, 2025
పాల్వంచ రూరల్: లోన్ ఇస్తామంటూ మోసం..!
లోన్ రావాలంటే ముందు డిపాజిట్ చేయాలని మభ్యపెట్టి నగదు కాజేసిన ఘటన పాల్వంచ రూరల్ జరిగింది. అధికారుల కథనం ప్రకారం.. తోగ్గూడెం గ్రామానికి చెందిన ఇర్ప మానస ఇటీవల ఫోన్ యాప్ ద్వారా లోన్ కోసం ప్రయత్నించింది. ముందుగా కొంత డబ్బు డిపాజిట్ చేస్తే రుణం వస్తుందని యాప్ నిర్వాహకులు నమ్మించారు. దీంతో ఆమె రూ.62,350 చెల్లించింది. ఆ తర్వాత ఆ యాప్ పనిచేయకపోవడంతో మోసపోయానని గ్రహించి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News February 6, 2025
కామారెడ్డి: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!
కామారెడ్డి జిల్లాలోని 24 మండలాల్లో సుమారు 501 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 6, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్కు తీరనున్న ఐరన్ ఓర్ కొరత
విశాఖ స్టీల్ ప్లాంట్కు ఐరన్ ఓర్ కొరత తీరనుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్టీల్ ప్లాంట్కు పూర్తిస్థాయిలో ఐరన్ ఓర్ సరఫరా చేసేందుకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ అధికారులు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో ఈ ఏడాది ఆగస్టు నుంచి మూడో బ్లాస్ట్ ఫర్నెస్ ప్లాంట్ ఉపయోగంలోకి తీసుకురానున్నారు. మొత్తంమీద స్టీల్ ప్లాంట్కు కొంత ఊపిరి అందిస్తున్నారు.