News March 13, 2025

వికారాబాద్: నీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలి: డీపీవో

image

వేసవి కాలం నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రతి ఒక్కరూ గ్రామాల్లో వంద శాతం ట్యాక్స్ డబ్బులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిణి, డాక్టర్ జయసుధ సూచించారు. ఆమె ధారూర్ మండలంలో గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ ఇన్స్‌పెక్షన్ నిర్వహించారు. చింతకుంట, కెరెల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

Similar News

News February 15, 2026

బాపట్లలో పండగ పూట విషాదం

image

బాపట్లలో పండగపూడ విషాద ఘటన చోటుచేసుకుంది. పట్టణ మాజీ ఐటీడీపీ అధ్యక్షుడు కారుమూరి సతీష్ (35) విద్యుత్ షాక్‌తో మరణించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సతీష్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌గా పనిచేస్తూ అందరికి సుపరిచితుడయ్యాడన్నారు. యువ నాయకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News February 15, 2026

మహబూబాబాద్‌లో 144 సెక్షన్: ఎస్పీ

image

మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణకు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 144 సెక్షన్ (163 BNSS) అమల్లో ఉంటుందని ఎస్పీ డా. శబరిష్ తెలిపారు. నలుగురికి మించి గుంపులుగా తిరగడం, విజయోత్సవ ర్యాలీలు, టపాకాయలు కాల్చడంపై నిషేధం విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

News February 15, 2026

వాలీబాల్ లీగ్ పోటీల్లో కృష్ణాజిల్లా జట్టు ప్రథమ స్థానం

image

భట్టిప్రోలులో నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థుల వాలీబాల్ లీగ్ పోటీలు ఆదివారంతో ముగిసినట్లు ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ కరీంశెట్టి సుబ్బారావు తెలిపారు. ఆదివారం భట్టిప్రోలు ప్రభుత్వ పాఠశాలలో సుబ్బారావు మాట్లాడారు. ఈ పోటీల్లో 8 టీములు పాల్గొన్నాయన్నారు. కృష్ణాజిల్లా 1వ స్థానం సాధించిందన్నారు. బాపట్ల జిల్లా-2, ప్రకాశం జిల్లా -3, ఎన్టీఆర్ జిల్లా -4వ స్థానంలో నిలిచాయన్నారు.