News February 25, 2025
వికారాబాద్: ‘పది’ పరీక్షలకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

జిల్లాలో పదవ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు 12,903 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.
Similar News
News November 17, 2025
మెగాస్టార్ చిరంజీవి మన పల్నాడులో చదువుకున్నారని మీకు తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి మన పల్నాడులో విద్యాభ్యాసం చేశారు. చిరంజీవి తండ్రి వెంకట్రావు గురజాల ఎక్సైజ్ కార్యాలయంలో కానిస్టేబుల్గా పనిచేశారు. ఆ సమయంలో చిరంజీవి గురజాల దుగ్గరాజు వారి సందులోని కిష్టయ్య పాఠశాలలో వరప్రసాద్ పేరుతో చదువుకున్నారు. ఆయన గురజాలకు వచ్చినప్పుడు తాను చదువుకున్న పాఠశాలను, పాతపాటేశ్వరి అమ్మవారి దేవాలయాన్ని గుర్తు చేసుకున్నారు.
News November 17, 2025
మేడారం జాతరకు భద్రాద్రి నుంచి ప్రత్యేక బస్సులు

జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహా జాతరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలని టీజీఆర్టీసీ యోచిస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం కూడా ఈ జాతర సందర్భంగా అమలులో ఉండనుంది. తెలంగాణ ఆర్టీసీ ఈసారి మొత్తం 4,000 బస్సులను నడపాలని లక్ష్యంగా పెట్టుకుంది.
News November 17, 2025
అల్లూరి: బర్త్డే కేకు తిన్న విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత

కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 24 విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం రాత్రి పాఠశాలలో ఓ విద్యార్థిని బర్త్ డే సందర్భంగా కట్ చేసిన కేకును తిని, విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని స్థానిక పీహెచ్సీకి తరలించారు. విషమంగా ఉన్న ఇద్దరు విద్యార్థులను ఆదివారం విశాఖ కేజీహెచ్కు తరలించారు. ఏటీడబ్ల్యూవో క్రాంతి కుమార్ పర్యవేక్షిస్తున్నారు.


