News February 25, 2025
వికారాబాద్: ‘పది’ పరీక్షలకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

జిల్లాలో పదవ తరగతి పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పదవ తరగతి పరీక్షలకు 12,903 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు.
Similar News
News December 13, 2025
చంద్రబాబుపై ఫైబర్నెట్ కేసు కొట్టివేత

AP: సీఎం చంద్రబాబుకు భారీ ఊరట కలిగింది. గత ప్రభుత్వ హయాంలో నమోదైన ఫైబర్నెట్ కేసును ACB కోర్టు కొట్టేసింది. ఇతర నిందితులకూ క్లీన్చిట్ ఇచ్చింది. 2014-19 మధ్య ఫైబర్నెట్లో ₹114Cr స్కామ్ జరిగిందని కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా CID అధికారులు ఆ కేసు దర్యాప్తును ముగించినట్లు కోర్టుకు తెలిపారు. కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని నాటి, నేటి ఫైబర్నెట్ MDలు చెప్పారు. దీంతో కోర్టు తీర్పు వెలువరించింది.
News December 13, 2025
ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు: కలెక్టర్

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. మొదటి విడత ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. వారికి వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
News December 13, 2025
వృద్ధురాలిపై అత్యాచారయత్నం కేసులో వ్యక్తి అరెస్ట్: మొగల్తూరు SI

బీచ్ సమీపంలోని కొబ్బరితోటలో ఓ వృద్ధురాలి(65)పై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిని అరెస్టు చేసినట్లు మొగల్తూరు ఎస్ఐ వై. నాగలక్ష్మి తెలిపారు. గురువారం తోటలో పనులు చేసుకుంటున్న ఆమెపై పెద్దిరాజు(29) దాడి చేయగా.. బాధితురాలి కేకలతో స్థానికులు అప్రమత్తమయ్యారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని శుక్రవారం కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.


