News February 3, 2025

వికారాబాద్: పదేళ్లుగా మందు బంద్!

image

గత 10 సంవత్సరాలుగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు ధారూర్ మండలం రుద్రవరం గ్రామస్థులు. నేటికి ఆ నిబంధనలకు కట్టుబడి ఉన్నారు. దీంతో ఆదివారం దిశా కమిటీ మెంబర్ డాక్టర్ రాజశేఖర్ గ్రామాన్ని సందర్శించి, ప్రజలను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయలక్ష్మి, ప్యాట శంకర్, గొడుగు సుధాకర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 25, 2025

ఖమ్మం: సర్పంచ్ ఎన్నికలు.. వారే కీలకం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. ఖమ్మంలో 8,02,691మంది ఓటర్లు ఉండగా పురుషుల కంటే 26,182 మంది, కొత్తగూడెంలో 6,69,048 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 18,934 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు జనరల్ స్థానాల్లోనూ మహిళా అభ్యర్థులను నిలపాలని యోచిస్తున్నాయి. కొందరు నాయకులు తమ కుటుంబ సభ్యుల్లోని మహిళలను పోటీకి సిద్ధం చేస్తున్నారు.

News November 25, 2025

అమరావతికి మహార్దశ.!

image

అమరావతిలో రాజధాని అభివృద్ధి నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్‌కు నిరాశ మిగలనుంది. ప్రధాన రైల్వే జంక్షన్‌గా ఉన్న విజయవాడ స్టేషన్‌లో రద్దీ దృష్ట్యా 10 ప్లాట్‌ఫామ్స్‌కి అదనంగా 2 నిర్మించాలని రైల్వే శాఖ భావించింది. అయితే ఇప్పుడు ఈ అభివృద్ధి అమరావతిలో కొత్త టెర్మినల్ నేపథ్యంలో ప్లాట్ ఫామ్ విస్తరణను అధికారులు నిలిపివేశారు. వీటికి అయ్యే ఖర్చును రైల్వే శాఖ అమరావతి, గన్నవరం స్టేషన్లపై పెట్టనుంది.

News November 25, 2025

డిగ్రీ అర్హతతో 5,810 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

రైల్వేలో 5,810 NTPC పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. సికింద్రాబాద్ రీజియన్‌లో 396 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హతతో 18- 33ఏళ్లు గల వారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CBT, స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలు రూ.250 చెల్లించాలి. *మరిన్ని ఉద్యోగాల కోసం<<-se_10012>> జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.