News February 3, 2025

వికారాబాద్: పదేళ్లుగా మందు బంద్!

image

గత 10 సంవత్సరాలుగా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు ధారూర్ మండలం రుద్రవరం గ్రామస్థులు. నేటికి ఆ నిబంధనలకు కట్టుబడి ఉన్నారు. దీంతో ఆదివారం దిశా కమిటీ మెంబర్ డాక్టర్ రాజశేఖర్ గ్రామాన్ని సందర్శించి, ప్రజలను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయలక్ష్మి, ప్యాట శంకర్, గొడుగు సుధాకర్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 22, 2025

SERP పనితీరుపై మంత్రి కొండపల్లి సమీక్ష

image

SERP పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పనితీరు, రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.16,846 కోట్లు రుణాలు మంజూరయ్యాయని, 2026 మార్చి నాటికి రూ.32,322 కోట్లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

News November 22, 2025

ఏడు శనివారాల వ్రతాన్ని ఎలా చేయాలి?

image

భార్యాభర్తల్లో ఎవరైనా ఈ వ్రతం చేయవచ్చు. మొదటి వారం శ్రీనివాసుడి చిత్రపటం/విగ్రహాన్ని అలంకరించి, వ్రతం ప్రారంభిస్తున్నామని సంకల్పం చెప్పాలి. కోరిన కోర్కెలు నెరవేరితే 7 కొండలు ఎక్కుతామని ముడుపు కట్టాలి. 7 వారాల పాటు 7 వత్తుల దీపం వెలిగించాలి. పూజ ఎలాగైనా చేయవచ్చు. శనివారాల్లో మద్యమాంసాల్ని ముట్టుకోకూడదు. చివరి వారం వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలి. వీలున్నప్పుడు తిరుపతి వెళ్లి ముడుపు సమర్పించాలి.

News November 22, 2025

అప్డేట్ కోసం కానస్టేబుల్ అభ్యర్థులు ఎదురుచూపులు

image

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.