News March 4, 2025

వికారాబాద్: పరీక్షలకు సర్వం సిద్ధం: శంకర్ నాయక్

image

జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి శంకర్ నాయక్ తెలిపారు. మంగళవారం ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు నోడల్ అధికారితో కలిసి పరిశీలించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8:45లోగా పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు చేరుకోవాలని 9:05 నిమిషాల వరకు అనుమతి ఇస్తారన్నారు.

Similar News

News October 25, 2025

గ్రేటర్ తిరుపతి అంటే ఏమిటి…?

image

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం 30.174 చ.కి.మీ పరిధిలో ఉంది. గ్రేటర్ హోదా వచ్చాక రేణిగుంట, చంద్రగిరి, తిరుపతి రూరల్, ఏర్పేడులోని 63 పంచాయితీలు విలీనమవుతాయి. దీంతో గ్రేటర్ తిరుపతి నగరపాలక సంస్థ సుమారు 283.804 చ.కి.మీ పెరుగుతుంది. దీని ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకు మరింత సౌకర్యాలు మెరుగవ్వడం, భూమి ధరలు పెరగడం తదితర లాభాలు ఉన్నాయి.

News October 25, 2025

ఖానాపూర్: జూనియర్‌పై సీనియర్ విద్యార్థుల లైంగిక దాడి

image

ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహంలో ఓ విద్యార్థిపై లైంగిక వేధింపులు జరిగిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వార్డెన్, HM, స్థానికుల ప్రకారం.. 4 రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో హాస్టల్‌లో ఉంటున్న 9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు, 6వ తరగతి చదువుతున్న బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 25, 2025

జగ్గయ్యపేట: నాడు తండ్రి.. నేడు కుమారుడు గుండెపోటుతో మృతి

image

పదేహేనేళ్లకే కొడుకు గుండెపోటుతో మృతి చెందడంతో ఆ తల్లి తల్లడిల్లింది. విగతజీవిగా పడి ఉన్న కుమారుడ్ని చూసి ఆమె రోదించిన తీరు వర్ణనాతీతం. జగ్గయ్యపేటలో గోలి వెంకట గణేష్ నిన్న పాఠశాలకు వెళుతూ గుండెపోటుతో మరణించాడు. బాలుడి తండ్రి రామారావు 2ఏళ్ల క్రితం గుండెపోటుతోనే చనిపోయాడు. మరో అయిదేళ్లలో కొడుకు చేతికొస్తాడకున్న ఆ తల్లి ఆశల్ని నిరాశలు చేస్తూ గణేశ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అందర్నీ కలిచివేసింది.