News February 26, 2025
వికారాబాద్: పహాని స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

పహాని స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ రెవెన్యూ శాఖ అధికారులతో రెవెన్యూ సమస్యలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2020-25 మధ్య సంవత్సరంలో ఉన్న ప్రతి పహానిని గ్రామాల వారీగా పూర్తి సర్వే నిర్వహించాలన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలన్నారు.
Similar News
News March 19, 2025
వికారాబాద్ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీఈఓ రేణుకాదేవి తెలిపారు. ఏలాంటి ఇబ్బందులు, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08416 235245కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పారు.
News March 19, 2025
పాకిస్థాన్లో చైనా ఆర్మీ..!

పాకిస్థాన్లో ఆర్మీ, ప్రైవేట్ సెక్యూరిటీని మోహరించేలా చైనా ఒప్పందం చేసుకుంది. సీపెక్ ప్రాజెక్టులోని చైనా కార్మికులని, ఇంజినీర్లను కాపాడేందుకు వీలుగా ఈ డీల్ జరిగింది. ఈ ఒప్పందంతో డ్రాగన్ దేశానికి చెందిన పలు భద్రతా ఏజెన్సీలు పాక్లోని చైనా జాతీయుల భద్రతను పర్యవేక్షిస్తాయి. పాక్లో బలూచిస్థాన్ వేర్పాటు వాదుల దాడుల నేపథ్యంలో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News March 19, 2025
శ్రీకాకుళంలో దంచి కొడుతున్న ఎండలు

శ్రీకాకుళం జిల్లాలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో శ్రీకాకుళం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు, పాదచారులు చాలాచోట్ల మజ్జిగ, పండ్ల రసాలు తాగుతున్నారు. మరో రెండు నెలలు జిల్లాలో ఎండల తీవ్రంగా ఉంటే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారుల, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.