News February 14, 2026
వికారాబాద్ పురపోరులో కారుకు బ్రేకులు..!

వికారాబాద్ జిల్లా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పరాజయంపై కేడర్ భగ్గుమంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వపై ఉన్న వ్యతిరేకతను వాడుకోవడంలో జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ ఘోరంగా విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెతుకు ఆనంద్ తన భార్యను పోటీలో ఉంచినా.. వికారాబాద్ దక్కేదని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. రోహిత్ రెడ్డి, మహేష్ రెడ్డి వంటి నేతలు కష్టపడినా ఫలితం దక్కలేదు.
Similar News
News March 7, 2026
పోలవరం: జిల్లాలో ఎటుచూసినా పులి భయం

పోలవరం జిల్లా రంపచోడవరం అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో ప్రాంతంలో పులి జాడ కనిపించడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. శుక్రవారం ఫోక్స్ పేట అటవీప్రాంతంలో పులి ఉందని అధికారులు నిర్ధారించారు. అయితే చింతూరు డివిజన్లోని ఎటపాకలో కూడా మరో పులి తిరుగుతుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పులి సంచారం భయపెడుతోంది.
News March 7, 2026
తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ

TPCC మహిళా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ నియామకమయ్యారు. ఆమె నియామకాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు ఆమోదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన ఆమె కాంగ్రెస్లో 45 ఏళ్లుగా ఉన్నారు. 1991లో PACS ఛైర్పర్సన్గా తొలిసారి ఎన్నికవగా 2005లో వరంగల్ నగర మేయర్గా పని చేశారు. వరంగల్ పశ్చిమ నుంచి MLAగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023-2025 వరకు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా పని చేశారు.
News March 7, 2026
KKD: పదోన్నతులు ఇచ్చారు.. జీతాలు ఇవ్వడం మరిచారు!

కాకినాడ జిల్లాలో పదోన్నతి పొందిన 60 మంది సచివాలయ అధికారులకు నెలల తరబడి జీతాలు అందకపోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 1న DyCM చొరవతో ప్రమోషన్లు వచ్చినప్పటికీ, నేటికీ వేతనాలు రాలేదని వాపోతున్నారు. పంచాయతీరాజ్ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తిందని అధికారులు ఆరోపిస్తున్నారు. తమకు వెంటనే జీతాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.


