News February 3, 2025
వికారాబాద్ ప్రజావాణిలో 106 దరఖాస్తులు
వికారాబాద్ ప్రజావాణిలో 106 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో కారుణ్య నియామకాలు, ఆపద్బంధువు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్, రైతు భరోసా, రుణ మాఫీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని కలెక్టర్ అధికారుల సూచించారు.
Similar News
News February 4, 2025
వికారాబాద్: టెండర్ నోటిఫికేషన్
జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ రెసిడెన్షియల్, స్కూల్స్, హాస్టల్స్, ఇతర ప్రభుత్వ భవనాలకు రంగులు వేయుటకు టెండర్కు నోటిఫికేషన్ విడుదల చేశారు. రూ.15వేల లీటర్ల ఎక్సటరియర్ వాల్ పెయింట్స్ బయట వైపున గోడకి రంగులు అవసరం ఉన్నందున సప్లైచేయుటకు ఆసక్తి సప్లయర్స్కు డీలర్స్ తమ టెండర్లను ఏవో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కలెక్టరేట్ ఐడీఓసీకి ఈనెల 5న సాయంత్రం వరకు దాఖలు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News February 4, 2025
పెన్షన్ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు
AP: ఉదయం 5, 6 గంటలకే పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సిన అవసరం లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే విషయంపై ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు వస్తుండటంతో ఆయన స్పందించారు. అనవసర నిబంధనలతో ఇబ్బంది పెట్టొద్దని, ఉ.7 నుంచి సా.6 లోపు పంపిణీ పూర్తి చేస్తే సరిపోతుందని చెప్పారు. ఇంటి వద్ద కాకుండా ఇతర ప్రాంతాల్లో పెన్షన్ ఇస్తున్నట్లు తేలితే కారణాలు తెలుసుకోవాలన్నారు. లబ్ధిదారులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
News February 4, 2025
ఏలూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో 16,077 ఓట్లు
ఏలూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 16,077 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెట్రి సెల్వి సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఓట్లలో 9,858 మంది పురుషులు, 6,218 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారన్నారు. 20 పోలింగ్ స్టేషన్లకు అదనంగా, మరో పోలింగ్ కేంద్రాన్ని ప్రతిపాదించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 8,501 క్లైమ్లు అందాయన్నారు.