News February 3, 2025
వికారాబాద్ ప్రజావాణిలో 106 దరఖాస్తులు

వికారాబాద్ ప్రజావాణిలో 106 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రజావాణిలో కారుణ్య నియామకాలు, ఆపద్బంధువు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్, రైతు భరోసా, రుణ మాఫీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డు, వ్యవసాయ, పశు సంవర్ధక శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా కృషి చేయాలని కలెక్టర్ అధికారుల సూచించారు.
Similar News
News November 15, 2025
జగిత్యాల: ‘గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బిర్సా’

భగవాన్ బిర్సా 150వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నివాళులు అర్పించారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీ.ఎస్. లత మాట్లాడుతూ.. బ్రిటిష్ దోపిడీకి వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు భగవాన్ బిర్సా ప్రజలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ‘ధర్తీ ఆబా’గా ప్రజల హక్కులు, గిరిజన సంస్కృతి పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
News November 15, 2025
గొల్లపల్లి: ‘ధాన్యం కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి’

ధాన్యం కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గొల్లపల్లి, పెగడపల్లి, కొండయ్యపల్లి, రాపల్లె గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం ఆయన పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, నిస్పాక్షికంగా కొనుగోలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. పలువురు అధికారులున్నారు.
News November 15, 2025
NRPT: అనుమతులను నిర్దేశిత గడువులోగా మంజూరు చేయాలి కలెక్టర్

జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ టిజి ఐపాస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు వివిధ శాఖల నుంచి మంజూరు చేయవలసిన అనుమతులను నిబంధనల మేరకు నిర్దేశిత గడువులోగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.


