News February 1, 2025
వికారాబాద్: ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా వ్యాప్తంగా రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొనేందుకు కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవోలు అధికారులు వేసవి నీటి కరువు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News November 15, 2025
బిహార్ రిజల్ట్స్: ఎన్డీఏ డబుల్.. కాంగ్రెస్ ఢమాల్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమిని తెచ్చిపెట్టాయి. ఎన్డీఏ డబుల్ సెంచరీ కొట్టగా కాంగ్రెస్ మాత్రం 6 సీట్లకే పరిమితమైంది. గత ఎన్నికల్లో INCకి 19 సీట్లు రాగా ఈ సారి అందులో మూడో వంతే రావడం గమనార్హం. డబుల్ ఇంజిన్ సర్కారుకే మొగ్గు చూపిన ఓటర్లు రాహుల్ ప్రచారాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఇక బీజేపీకి 89 సీట్లు రాగా జనతా దళ్కు ఏకంగా 85 వచ్చాయి.
News November 15, 2025
పుట్టపర్తి కలెక్టరేట్లో గ్రీవెన్స్ తాత్కాలిక రద్దు

పుట్టపర్తిలోని కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను ఈ నెల 17న తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. సత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు సమర్పించడానికి ప్రజలు కలెక్టరేట్కు రావద్దని కలెక్టర్ కోరారు.
News November 15, 2025
అరటి రైతు ఆర్తనాదం

అనంతపురం జిల్లాలో అరటి రైతులు గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. పంటకు కనీస మద్దతు ధర లేక, కొనేవారు కరువై దయనీయ స్థితి నెలకొంది. మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకే ఢిల్లీ మార్కెట్కు అరటి చేరుతుండటంతో స్థానిక వ్యాపారులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 15వేల హెక్టార్లలో పంట సాగులో ఉండగా, టన్ను ధర రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకే ఉండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


