News February 5, 2025

వికారాబాద్: భూ సమస్యలపై అవగాహన కల్పించుకోవాలి: కలెక్టర్

image

భూసమస్యలతో పాటు ఇతర సమస్యలపై అవగాహన పొంది ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నూతనంగా విధుల్లో చేరిన 34 మంది జూనియర్ అసిస్టెంట్‌లకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఎప్పటికప్పుడు సమస్యలపై అవగాహన కల్పించుకొని పరిణతితో ప్రజలకు చక్కగా సేవలందించాలన్నారు. 

Similar News

News April 5, 2026

భద్రాద్రిలో వైభవంగా శ్రీరాముడి నిత్య కళ్యాణం

image

భద్రాద్రి క్షేత్రంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణ వేడుక శనివారం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల కారణంగా కొద్దిరోజులు నిలిచిపోయిన ఈ క్రతువు మళ్లీ ప్రారంభం కావడంతో భక్తులు పోటెత్తారు. భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణ సేవలో పాల్గొన్నాయి. అర్చకులు వేదమంత్రాల సాక్షిగా మాంగల్యధారణ, తలంబ్రాల ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

News April 5, 2026

గుంటూరు: కౌలు రైతులకు రుణాలు.. అమల్లో లోపాలు

image

కౌలు రైతులకు రుణాలందించాలన్న ప్రభుత్వ లక్ష్యం క్షేత్రస్థాయిలో సరిగా అమలు కావడం లేదు. PACS ద్వారా రుణాలు ఇవ్వాలని నిర్ణయించినా అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. CCRC, నివాస ప్రమాణాలు ఉన్నా భూయజమాని అనుమతి లేదనే కారణాలతో రుణాలు నిలిచిపోయాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ.10 కోట్ల లక్ష్యం పెట్టినా అమలు చాలా తక్కువగా ఉంది. సొసైటీల స్థాయిలో ప్రయత్నాలే జరగలేదని తెలుస్తోంది.

News April 5, 2026

ధోనీ రిటైర్మెంట్‌పై అంబటి రాయుడి అంచనా ఇదే!

image

IPLకు ధోనీ రిటైర్మెంట్‌పై అంబటి రాయుడు చేసిన ప్రిడిక్షన్ ఇప్పుడు SMలో వైరలవుతోంది. IPL 2025 సీజన్‌ తర్వాత RCBతో ధోనీ మళ్లీ ఆడే అవకాశం లేదని రాయుడు అంచనా వేశారు. దీంతో పరోక్షంగా ధోనీ కెరీర్‌ ముగిసిందని హింట్ ఇచ్చారని క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అలాగే కోహ్లీ కంటే ముందే ధోనీ IPL నుంచి తప్పుకొంటారన్నారు. CSK స్థాయిలో రాబోయే పదేళ్లలో RCB ట్రోఫీలు గెలిచే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.