News February 1, 2025
వికారాబాద్: రిటైర్డ్ టీచర్ రామస్వామి మృతి

ఉత్తమ ఉపాధ్యాయుడిగా సేవలు అందించిన కొత్తపేట రామస్వామి మృతిచెందడం చాలా బాధాకరమని కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాజేశ్వరమ్మ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో రిటైర్ టీచర్ కొత్తపేట రామస్వామి అనారోగ్యంతో మృతిచెందగా రాజేశ్వరమ్మ పరామర్శించి వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. రాజేశ్వరమ్మ మాట్లాడుతూ.. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.
Similar News
News October 31, 2025
రోహిత్కు కెప్టెన్సీ ఇచ్చేయండి: ఫ్యాన్స్

హిట్మ్యాన్ రోహిత్ శర్మ తమతో కొనసాగుతారని ముంబై ఇండియన్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతని ఫ్యాన్స్ ఓ కొత్త డిమాండ్ మొదలుపెట్టారు. ముంబైలో కొనసాగేందుకు తిరిగి జట్టు పగ్గాలు హిట్ మ్యాన్కు అప్పగించాలని SMలో డిమాండ్ చేస్తున్నారు. ‘కేవలం రోహిత్ సారథ్యంలోనే ముంబై కప్పు కొట్టగలదు. కెప్టెన్సీతో అతనికి తగిన గౌరవం ఇవ్వాలి’ అని కామెంట్స్ చేస్తున్నారు.
News October 31, 2025
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు: VZM DMHO

PC & PNDT చట్టం ప్రకారం లింగ నిర్ధారణ నిషేధమని, ప్రతి స్కానింగ్ సెంటర్ తప్పనిసరిగా వివరాలు నమోదు చేసి సమర్పించాల్సిందేనని DMHO డా. జీవన రాణి తెలిపారు. DMHO కార్యాలయంలో జరిగిన సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వానికి చెందిన 22 స్కానింగ్ సెంటర్లతో పాటు ప్రైవేట్ రంగంలో మరో 102 సెంటర్లు జిల్లాలో పనిచేస్తున్నాయని చెప్పారు. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 31, 2025
ఒంగోలులో కారు ఢీకొని వ్యక్తి మృతి

ఒంగోలులోని త్రోవగుంట బృందావనం కల్యాణ మండపం వద్ద కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు కర్నాటి వెంకటసుబ్బారెడ్డిగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన కోణపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


