News January 25, 2025
వికారాబాద్: రేపటి నుంచి 4 సంక్షేమ పథకాలు అమలు: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ళు, ఆహార బద్రత(రేషన్) కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు, ఆత్మీయ బరోసా పథకాలకు ఆదివారం స్వీకారం చుట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ శాంతకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 7, 2025
ఆదిలాబాద్: 50 నుంచి 100 మందికి ఓ బాధ్యుడు..!

పంచాయతీ పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది సర్పంచి అభ్యర్థులు ప్రచార జోరు పెంచుతున్నారు. ప్రతి ఓటు కీలకం కావడంతో ఓటర్లు ప్రత్యర్థివైపు వెళ్లకుండా వ్యూహాలు పన్నుతున్నారు. కొన్ని పంచాయతీల్లో 50 నుంచి 100 మంది ఓటర్లకు ఓ బాధ్యున్ని నియమిస్తూ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కీలకమైన కుల సంఘాల ఓట్లు దక్కించుకునేందుకు ఆ సంఘంలో చురుకుగా ఉండే వారికి బాధ్యతలు ఇస్తూ ఓట్లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
News December 7, 2025
మరిపెడ: ఈత చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామానికి చెందిన గౌడ సంఘం అధ్యక్షుడు పోగుల సత్యం(60) ఆదివారం ఈత చెట్టు పై నుంచి జారిపడి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్యం రోజు మాదిరిగానే కల్లు గీత కోసం చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 7, 2025
విశాఖలో శ్రీకాకుళం మహిళ హత్య

శ్రీకాకుళం జిల్లాకు చెందిన దేవిని పెందుర్తి సుజాతనగర్లోని ఆమె సహజీవన భాగస్వామి శ్రీనివాస్ కుర్చీతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం జరగగా, హత్య చేసి శ్రీనివాస్ పరారయ్యాడు. నిందితుడు ఇటీవల రైస్ పుల్లింగ్ కేసులో అరెస్టయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పెందుర్తి సీఐ సతీశ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


