News March 21, 2025

 వికారాబాద్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

ఓ యువకుడు ఉద్యోగం సాధించి మొదటి రోజు విధులకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ధారూర్ మండలం కేరేల్లి గ్రామానికి చెందిన నవీన్(26) నిన్న ఉద్యోగానికి వెళ్లి వస్తుండగా కోకపేట టీగ్రీల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ అతడిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై నర్సింగ్ పోలీసుకు కేసు నమోదు చేశారు.

Similar News

News April 25, 2025

నిర్మల్: కన్న కొడుకును నరికి చంపిన తండ్రి

image

నిర్మల్ జిల్లా లక్ష్మణచందా మండలంలో దారుణం జరిగింది. మల్లాపూర్ గ్రామంలో కన్నకొడుకు గొడ్డలితో నరికి తండ్రి హత్య చేశాడు. గ్రామానికి చెందిన బైనం అశోక్ (29)ను అతని తండ్రి బైనం ఎర్రన్న ఇవాళ ఉదయం హత్య చేశాడని గ్రామస్థులు పేర్కొన్నారు. చంపిన అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెల్లి లొంగిపోయాడు. ఎస్ఐ రహమాన్ మాలిక్ ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 25, 2025

గణితంలోనే 3,934 మంది ఫెయిల్

image

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలో 3,934 మంది విద్యార్థులు ఒక్క గణితంలోనే ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత సైన్సులో 2,555 విద్యార్థులు ఫెయిల్ కావడం గమనార్హం. గణితం ప్రశ్నా పత్రంలో లోపాలు ఉన్నప్పటికీ విద్యార్థులు ప్రయత్నం చేశారని, అయినా ఫలితాలు నిరాశ కలిగించాయని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రీ-వెరిఫికేషన్‌కు సిద్ధం చేస్తున్నట్లు వారు వెల్లడించారు. 

News April 25, 2025

కుబీర్: ఇల్లరికం వచ్చి ప్రాణాలు తీసుకున్నాడు..!

image

అత్తారింటికి ఇల్లరికానికి వచ్చి భార్యతో గొడవపడి ఓ అల్లుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రవీందర్ వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని ఉమ్రి గ్రామానికి చెందిన సురేశ్ కుబీర్ లోని అంతర్నీ గ్రామానికి చెందిన రోజాతో వివాహం జరిగింది. అయితే మంగళవారం భార్యాభర్తలు గొడవ పడ్డారు. భార్య బంధువుల ఇంటికి వెళ్లిపోవడంతో జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తెలిపారు.

error: Content is protected !!