News February 6, 2025
వికారాబాద్: లగచర్లలో మరోసారి భూ సర్వే

దుద్యాల మండలంలోని లగచర్ల గ్రామంలో పారిశ్రామికవాడను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 8 నుంచి భూ సర్వేను చేపట్టనున్నట్లు తహశీల్దార్ కిషన్ పేర్కొన్నారు. పులిచెర్లకుంట, రోటిబండ తండా గ్రామాల్లో అసైన్డ్ భూములను సేకరించనున్నామని స్పష్టం చేశారు. కావున ఆయా ప్రాంతాల రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 15, 2026
ఎల్లుండి నుంచి స్కూళ్లు.. శనివారమూ హాలిడే ఇవ్వాలని రిక్వెస్టులు

TG: ప్రభుత్వ జీవో ప్రకారం స్కూళ్లకు రేపటితో సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి. శనివారం (17) నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే కనుమ జరిగిన నెక్స్ట్ రోజే సొంతూళ్ల నుంచి ఎలా రాగలమని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. శనివారమూ హాలిడే ఇస్తే ఎలాగూ ఆదివారం సెలవు కాబట్టి సోమవారం ఫ్రెష్గా పిల్లలను పంపొచ్చంటున్నారు. మరి మీ పిల్లలను ఎప్పటి నుంచి స్కూళ్లకు పంపుతారు? కామెంట్ చేయండి.
News January 15, 2026
ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

గతేడాది JUNEలో జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదంలో ఆ విమాన పైలట్ సుమిత్ సభర్వాల్ కూడా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సుమిత్ మేనల్లుడు, కెప్టెన్ వరుణ్కు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) నోటీసులిచ్చింది. దీనిని పైలట్స్ ఫెడరేషన్(FIP) తప్పుపట్టింది. కేసుతో సంబంధం లేని వ్యక్తిని విచారణకు పిలిచారని, ఇది వేధింపులతో సమానం అంటూ AAIBకి లీగల్ నోటీసులు పంపింది.
News January 15, 2026
రొంపిచర్ల: కోళ్లఫారంలో యువకుడి సూసైడ్

రొంపిచర్ల: కోళ్ల ఫారంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మధుసూదన్ చెప్పారు. పశ్చిమ బెంగాల్కి చెందిన రవీంద్ర చిక్బరైక్ (29) ఓ కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. ఆరోగ్యం సరిగాలేదని అతని భార్య రష్మీ తెలియజేసినట్లు ఎస్సై తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


