News March 13, 2025
వికారాబాద్: విద్యార్థుల దాతృత్వానికి సలాం..!

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సంగంకుర్దు గ్రామానికి చెందిన 9 నెలల బాలుడు వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.22లక్షల అవసరమని ఇటీవల తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న సంగంకుర్దు ప్రాథమిక పాఠశాల చిన్నారులు తమ పాకెట్ మనీని చిన్నారి వశిష్ట వైద్య చికిత్సకు అందించాలని భావించారు. వారు దాచుకున్న డబ్బులను బాధిత కుటుంబానికి ఉపాధ్యాయుల సాయంతో అందించారు.
Similar News
News November 16, 2025
మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన: మంత్రి సీతక్క

మేడారంలో మాస్టర్ ప్లాన్ మేరకు జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ తదితరులతో కలిసి ఆదివారం పరిశీలించారు. జంపన్న వాగు వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వాగు మెట్లను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా జంపన్న వాగు వంతెనపై జాలి (రక్షణ కంచె) ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
News November 16, 2025
తిరుపతి: విద్యుత్ సమస్యలు ఉంటే కాల్ చేయండి.!

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు CMD శివశంకర్ తెలిపారు. సోమవారం ఉదయం 10-12 మధ్య కార్యక్రమం ఉంటుందన్నారు. రాయలసీమ జిల్లాల ప్రజలు సమస్యలు ఉంటే 8977716661కు కాల్ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నం. 91333 31912 ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.
News November 16, 2025
కొమురవెల్లి: మల్లన్న కళ్యాణం, జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కళ్యాణం, జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆదివారం కలెక్టర్ హైమావతి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కొమురవెల్లిలో 14 డిసెంబర్ నుంచి 16 మార్చి 2026 వరకు జరిగే కార్యక్రమాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.


