News March 13, 2025
వికారాబాద్: విద్యార్థుల దాతృత్వానికి సలాం..!

వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం సంగంకుర్దు గ్రామానికి చెందిన 9 నెలల బాలుడు వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.22లక్షల అవసరమని ఇటీవల తల్లిదండ్రులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న సంగంకుర్దు ప్రాథమిక పాఠశాల చిన్నారులు తమ పాకెట్ మనీని చిన్నారి వశిష్ట వైద్య చికిత్సకు అందించాలని భావించారు. వారు దాచుకున్న డబ్బులను బాధిత కుటుంబానికి ఉపాధ్యాయుల సాయంతో అందించారు.
Similar News
News October 21, 2025
సంగారెడ్డి: ‘ఈనెల 25న దివ్యాంగుల జాతీయ సదస్సు’

దివ్యాంగుల- విద్య- ఉపాధి సంక్షేమం- సాధికారత అంశంపై ఈనెల 25న ఈనెల 25న దివ్యాంగుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర కార్యదర్శి అడివయ్య మంగళవారం తెలిపారు. హైదరాబాద్లోని కమలా నగర్లో ఉన్న భాస్కరరావు భవన్లో 25న ఉదయం 11 గంటలకు జాతీయ సదస్సు జరుగుతుందని, దివ్యాంగులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
News October 21, 2025
భద్రాద్రి: పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి

కొత్తగూడెం జిల్లా పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ హేమచంద్రాపురంలో పోలీస్ అమరవీరుల స్మృతి పరేడ్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పోలీస్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు.
News October 21, 2025
రాయచోటిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం

రాయచోటి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన ఘన స్వాగతం తర్వాత ఆయన అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా SP ధీరజ్, JC ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా DSPలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.