News April 2, 2025
వికారాబాద్: సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన స్పీకర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరికి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పాత గంజిలో డీలర్ గోపాల్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ నాయక్, ఆర్డిఓ వాసు చంద్ర, మున్సిపల్ మాజీ ఛైర్మన్ సత్యనారాయణ, తహశీల్దార్ పాల్గొన్నారు.
Similar News
News February 24, 2026
చార్మినార్ భాగ్యలక్ష్మి గుడికి కరీంనగర్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నేడు పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఉదయం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశమైన అనంతరం, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించి, స్థానిక నాయకులతో భోజన కార్యక్రమంలో పాల్గొంటారు.
News February 24, 2026
అనంతపురం జిల్లాలో మొదలైన ఇంటర్ సెకండియర్ పరీక్షలు

అనంతపురం జిల్లాలోని 64 కేంద్రాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. నోటీసు బోర్డుల వద్ద ఏర్పాటు చేసిన రోల్ నంబర్ల షీట్లను సరిచూసుకుని లోపలికి వెళ్లారు. అధికారులు నిబంధనల ప్రకారం పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
News February 24, 2026
విజయవాడలో మహిళతో గొడవ.. యువకుడి సూసైడ్

కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మాచవరంలో సుమంత్ స్వీట్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ఓ మహిళతో పరిచయం ఏర్పడగా ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఇరువురికి ఇటీవల గొడవలు జరుగడంతో మనస్తాపం చెందిన సుమంత్ సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.


