News February 3, 2025
వికారాబాద్: సమస్యలకు సత్వరం పరిష్కారం: కలెక్టర్ ప్రతీక్
శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి 106 ఫిర్యాదులు రావడం జరిగిందని వివిధ శాఖల అధికారులు పరిశీలించి ఫిర్యాదులను పరిష్కరించి ఆర్జీదారులకు న్యాయం చేయాలన్నారు.
Similar News
News February 4, 2025
గీసుగొండ సీఐ హెచ్చరిక
సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులలో వివాదాస్పదంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టుకుంటున్న విషయం తమ దృష్టికి రాగా వారిని గీసుగొండ తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 4, 2025
ఖమ్మం: ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమం విజయవంతం
ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించిన కార్యక్రమంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 53 మంది బాల బాలికలను గుర్తించి విముక్తి కలిగించినట్లు తెలిపారు. బాలురు-44, బాలికలు 04 మొత్తం మంది 53 మంది ఉన్నారన్నారు. 16 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారన్నారు.
News February 4, 2025
కొండపాకలో సనీ నటుడు సుమన్
అప్పుడే పుట్టిన పిల్లలకు సైతం గుండె సంబంధిత సమస్యలకు ఉచిత వైద్యం అందిస్తున్న సంజీవని ఆసుపత్రి సేవలు అమోఘమని సినీ నటుడు సుమన్ అన్నారు. సోమవారం కొండపాకలోని సంజీవని ప్రశాంతి నికేతన్ శిశు హృదయ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ను సుమన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి చక్రపాణితో కలిసి ఆయన సందర్శించారు. గుండె సంబంధిత చిన్నారులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.