News February 18, 2025

వికారాబాద్: 1.70 లక్షల మందికి రైతు భరోసా

image

రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం జమ చేస్తోంది. వికారాబాద్ జిల్లాలో 1.70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.136,48,29,701 జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మూడు ఎకరాల వరకు భూమికి డబ్బులు జమ అవుతున్నాయి. జిల్లాలో మొత్తం 2,75,513 రైతులకు చెందిన 1,14,492 ఎకరాల భూమికి రూ.344,665,23,099 జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా మార్చి చివరి నాటికి అర్హులందరికీ సాయం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

Similar News

News March 15, 2025

కౌటాల: గ్రూప్-3లో 3వ ర్యాంకు 

image

కౌటాల మండలం గుడ్లబోరికి చెందిన కామ్రే భాస్కర్ ఇటీవల విడుదల చేసిన <<15731644>>గ్రూప్-2లో 381మార్కులతో 229 ర్యాంకు సాధించారు.<<>> కాగా నిన్న విడుదల చేసిన గ్రూప్-3 ఫలితాల్లోనూ 296.1 మార్కులతో 154వ ర్యాంకు సాధించారు. 2016లో సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందిన భాస్కర్ ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్‌గా వున్నారు. చిన్ననాటి నుంచే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే సంకల్పంతో పోటీ పరీక్షలకు సిద్ధమైనట్లు తెలిపారు.

News March 15, 2025

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

image

KNR జిల్లా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఈదులగట్టేపల్లి 40.9°C నమోదు కాగా, జమ్మికుంట 40.7, నుస్తులాపూర్ 40.6, చిగురుమామిడి 40.5, ఇందుర్తి, అర్నకొండ, కొత్తపల్లి-ధర్మారం 40.4, గంగాధర 40.3, దుర్శేడ్, మల్యాల 40.2, గుండి 40.1, ఖాసీంపేట, రేణికుంట 40.0, KNR 39.9, గంగిపల్లి 39.8, వీణవంక 39.6, గట్టుదుద్దెనపల్లె, చింతకుంట, పోచంపల్లి 39.5, బురుగుపల్లి 39.3°C గా నమోదైంది.

News March 15, 2025

సిRAW: భావోద్వేగాలే.. బాగోగుల్లేవిక్కడ

image

ఎన్నికలంటే ఐదేళ్ల ప్రోగ్రెస్ కార్డుతో ప్రచారాలుండాలి. ఇటీవల పాలకులు ప్రాంతం, జాతి, మతం, భాష అని ఎమోషనల్ కార్డు ప్లే చేస్తున్నారు. భావోద్వేగ డ్రామాతో పోల్ ఘట్టం గట్టెక్కేస్తున్నారు. ప్రశ్నించాల్సిన విపక్షాలూ కుర్చీ కోసం ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. అని పండగ సేల్‌లా ఆఫర్లిస్తున్నాయి. ప్రజల కోసం ఫలానా చేశామని చెప్పట్లేదు. ఎవరికి పవర్ వచ్చినా ప్రసాదం తినలేని ప్రజాస్వామ్య దేవుళ్లకే ఎగనామం. ఏమంటారు ఫ్రెండ్స్?

error: Content is protected !!