News March 26, 2025

వికారాబాద్: 128 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: అ.కలెక్టర్

image

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 2024-25 రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు తెలిపారు. బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మద్దతు ధర వరి ఏ-రకం ధాన్యానికి రూ.2320, సన్నాలకు రూ.500 బోనస్, మామూలు రకానికి రూ.2300 మద్దతు ధర నిర్ధారించడం జరిగిందన్నారు.

Similar News

News October 30, 2025

టారిఫ్‌ల తగ్గింపు కోసం USకు 350B డాలర్లు చెల్లించనున్న ద.కొరియా

image

టారిఫ్‌ల తగ్గింపు కోసం తమకు 350B డాలర్లు చెల్లించేందుకు ద.కొరియా ఒప్పుకుందని US ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ జరిగిందన్నారు. US నుంచి ఆయిల్, గ్యాస్‌ను భారీ మొత్తంలో కొనేందుకు కూడా ద.కొరియా అంగీకరించిందని తెలిపారు. ఆ దేశ కంపెనీలు USలో పెట్టే పెట్టుబడుల విలువ $600Bను మించిపోతుందన్నారు. అణుశక్తితో నడిచే జలాంతర్గామి నిర్మాణానికి వారికి అనుమతినిచ్చినట్లు చెప్పారు.

News October 30, 2025

532 పోస్టులు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్(UCO)లో 532 అప్రెంటిస్‌లకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఏదైనా డిగ్రీ పాసై 20- 28ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మొత్తం పోస్టుల్లో APలో 7, TGలో 8 ఖాళీలున్నాయి. రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. వెబ్‌సైట్: uco.bank.in/

News October 30, 2025

ధ్వజస్తంభం విశేషాలివే..

image

ధ్వజస్తంభాన్ని దర్శించిన తర్వాతే మూల విరాట్టును చూడాలంటారు. అంతటి ప్రాధాన్యం దీనికుంది. ఆలయ నిర్మాణంలో ఇది అత్యంత ముఖ్యమైన భాగం. ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగా, ధ్వజస్తంభాన్ని హృదయంగా భావిస్తారు. విగ్రహ ప్రతిష్ఠతో సమానంగా దీనిని ప్రతిష్ఠిస్తారు. ధ్వజస్తంభానికి కూడా దీపారాధనలు, ఉపచారాలు చేస్తారు. ఆలయ ద్వారాలు మూసి ఉన్నా, ధ్వజస్తంభ దర్శనంతో దైవదర్శన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.