News February 18, 2025

వికారాబాద్: 19న శివాజీ శోభాయాత్ర: హిందూ ఉత్సవ సమితి

image

చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఈనెల 19న వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి వీర హనుమాన్ దేవాలయం నుంచి వికారాబాద్ పట్టణం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు హిందూ ఉత్సవసమితి తెలిపింది. రాజకీయాలకతీతంగా దేశభక్తులు అందరూ ఈ కార్యక్రమంలోపాల్గొని కోరారు. పట్టణం మొత్తం ఇప్పటికే కాషాయముగా మారిందని, శివాజీ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 20, 2025

పోలి పాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలంటే..?

image

పోలి పాడ్యమిని నవంబర్ 21వ తేదీన(శుక్రవారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘పాడ్యమి తిథి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమై, నవంబర్ 21 మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకొని నవంబర్ 21నే పోలి పాడ్యమి నిర్వహించాలి. ఇక నవంబర్ 22, 2025 శనివారం తెల్లవారుజామున 4:35 నుంచి 6:00 గంటల వరకు దీపాలను నీటిలో వదలడానికి అనుకూల సమయం’ అని చెబుతున్నారు.

News November 20, 2025

ఫోన్‌పే టాప్!

image

మన దేశంలో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే ఆధిపత్యం కొనసాగుతోంది. 45.47% మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గూగుల్ పే (34.62%), పేటీఎం (7.36%), Navi (2.78%), సూపర్ మనీ (1.28%) ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా మార్కెట్ షేర్‌ను కలిగి ఉండటం విశేషం. BHIM, CRED లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వినియోగిస్తున్నారు. మరి మీరు ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి.

News November 20, 2025

ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన ఆటో డ్రైవర్

image

ఎండాడకు చెందిన బొబ్బిలి రమేశ్ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలు, భార్యను పోషిస్తున్నాడు. ఈనెల 10న తన నివాసంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. తలలో తీవ్ర రక్తస్రావం అయ్యి ఆరోగ్యం క్షీణించడంతో బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించగా అంగీకరించడంతో అవయవాలను ఐదుగురికి అమర్చనున్నారు. కుటుంబసభ్యుల మంచి మనసును పలువురు మెచ్చుకున్నారు.