News April 12, 2025
వికారాబాద్: RYVకి అప్లై చేశారా.. 14 వరకే ఛాన్స్

యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రాజీవ్ యువ వికాసం స్కీం’ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. శుక్రవారం వరకు వికారాబాద్ జిల్లాలో సుమారుగా 12 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 14 వరకు అవకాశం ఉంది. RYV మంచి అవకాశమని, దీన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అధికారులు పేర్కొన్నారు.
Similar News
News January 22, 2026
ట్రంప్ విమర్శలపై మోదీ మౌనం వెనక మతలబిదీ..!

ప్రపంచ నేతలను ట్రంప్ ఎడాపెడా వాయించేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, కెనడా PM కార్నీ, UK PM స్టార్మర్.. ఇలా స్థాయి, హోదా చూడకుండా కఠిన పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ పరిస్థితిని ఊహించే మన ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ట్రంప్ చేసిన ఏ విమర్శలకూ స్పందించలేదు. మౌనం పాటిస్తూ ఆయన వలలో పడకుండా చూసుకున్నారు. మోదీ ఈ హుందాతనం వల్లే ఆయనపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే సాహసం ట్రంప్ చేయలేదు.
News January 22, 2026
KMR: జనసేన పార్టీలో చేరికలు

కామారెడ్డి 8వ వార్డుకు చెందిన వివిధ పార్టీల యువకులు జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ మచ్చ సుధాకర్ సమక్షంలో, సీనియర్ నాయకుడు లక్ష్మీ నర్సాగౌడ్ ఆధ్వర్యంలో వీరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా సైనికులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News January 22, 2026
నైనీ కోల్ బ్లాక్ టెండర్ నోటిఫికేషన్ రద్దు: సింగరేణి

TG: నైనీ కోల్ బ్లాక్ టెండర్పై వివాదం రేగడంతో దానిని రద్దు చేస్తున్నట్లు ఇటీవల Dy CM భట్టి విక్రమార్క ప్రకటించడం తెలిసిందే. తాజాగా ఆ టెండర్ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్లు సింగరేణి కాలరీస్ కంపెనీ ప్రకటించింది. అటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధనపై SCCLను ప్రశ్నించింది. దీంతో టెండర్లపై మరోసారి బోర్డులో చర్చించి నిర్ణయిస్తామని చెప్పిన సంస్థ తదుపరి చర్యలు చేపట్టింది.


