News August 9, 2024
విజయనగరంలో అంగన్వాడీలపై కేసు కొట్టివేత

2017 టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నేతలపై పెట్టిన కేసులను మొబైల్ కోర్టు తాజాగా కొట్టి వేసింది. తమ డిమాండ్లను నెరవేర్చాలని 2017 సెప్టెంబర్ నెలలో కలెక్టరేట్ వద్ద సీఐటీయూ నేతలతో కలిసి అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. అనుమతి లేకుండా ధర్నా చేపట్టారని అంగన్వాడీ, సీఐటీయూ నేతలపై 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగేళ్ల విచారణ అనంతరం కేసు సరైంది కాదని కోర్టు కొట్టివేసింది.
Similar News
News December 27, 2025
VZM: కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో సి కేటగిరీలో ఉన్న కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు అన్ని ఏ ప్లస్ కేటగిరీకి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో కేపీఐలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయిలో 90, మండల స్థాయిలో 82 పారామీటర్లు వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.
News December 27, 2025
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన: విజయనగరం కలెక్టర్

జిల్లాలో పారిశ్రామిక వృద్ధికి ఔత్సాహికులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరంలోని కలెక్టరేట్లో DIEPC సమావేశాన్ని శనివారం నిర్వహించారు. జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన 8 పరిశ్రమల ద్వారా సుమారు 54 వేల మందికి ఉపాధి కలగనుందని తెలిపారు. దరఖాస్తులను సింగిల్ విండో విధానంలో వేగంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.
News December 27, 2025
జనవరి మొదటివారంలో సోలార్ రూఫ్టాప్ పథకం ప్రారంభం: కలెక్టర్

జనవరి మొదటివారంలో సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని ప్రారంభించాల్సిందిగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శనివారం సమీక్ష జరిపారు. జిల్లాలో ఈ పథకం అమలును మరింత వేగవంతం చేసి ప్రజలకు విస్తృతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవగాహన కార్యక్రమాలు పెంచి, దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన లాభాలు అందేలా చూడాలన్నారు.


