News April 4, 2025
విజయనగరంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్

విజయనగరంలోని వీటి అగ్రహారంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులంతా రీఛార్జి స్టేషన్ను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు ఉన్నారు.
Similar News
News October 18, 2025
VZM: ‘బాల, బాలికలకు సమాన అవకాశాలు’

అన్ని రంగాల్లో బాల, బాలికలకు నేడు సమాన అవకాశాలు ఉన్నాయని జిల్లా వైద్యారోగ్య అధికారిణి జీవనరాణి అన్నారు. సేవ్ ద గర్ల్ చైల్డ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఘోషాసుపత్రిని శనివారం సందర్శించారు. రెండో సంతానంగా ఆడబిడ్డలు పుట్టిన బాలింతల వద్దకు వెళ్లి లింగ వివక్షతపై అవగాహన కల్పించారు. బాలికలను చక్కగా చదివించాలని, నేడు అన్ని రంగాల్లో మహిళలదే పైచేయి అని తెలిపారు. లింగ వివక్షత చూపిస్తే చర్యలు తప్పవన్నారు.
News October 18, 2025
మిగిలిన బాణసంచాను జాగ్రత్తగా భద్రపరచాలి: SP

దీపావళి సందర్భంగా కేఎల్పురం శివార్లలో ఏర్పాటు చేసిన బాణసంచా షాపులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆకస్మికంగా పరిశీలించారు. వ్యాపారులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, షాపుల వద్ద నీరు, ఇసుక అందుబాటులో ఉంచాలని సూచించారు. గడువు ముగిసిన తరువాత మిగిలిన బాణసంచాను సురక్షిత గోడౌన్లలలో భద్రపర్చాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News October 18, 2025
ఈనెల 20న PGRS రద్దు: కలెక్టర్

ఈ నెల 20వ తేదీన దీపావళి పండగ సందర్బంగా ఆరోజు కలెక్టరెట్లో జరగనున్న PGRS రద్దు చేసినట్లు విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం ప్రకటించారు. తదుపరి వారం నుండి PGRS యథావిధిగా జరుగుతుందని తెలిపారు. ఈవారం PGRS రద్దు విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించి కలెక్టరెట్కు రావద్దని సూచించారు.