News April 4, 2025

విజయనగరంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ 

image

విజయనగరంలోని వీటి అగ్రహారంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులంతా రీఛార్జి స్టేషన్‌ను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు ఉన్నారు.

Similar News

News December 27, 2025

VZM: కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో సి కేటగిరీలో ఉన్న కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు అన్ని ఏ ప్లస్ కేటగిరీకి చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా, మండల స్థాయి అధికారులతో కేపీఐలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయిలో 90, మండల స్థాయిలో 82 పారామీటర్లు వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు.

News December 27, 2025

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన: విజయనగరం కలెక్టర్

image

జిల్లాలో పారిశ్రామిక వృద్ధికి ఔత్సాహికులకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరంలోని కలెక్టరేట్‌లో DIEPC సమావేశాన్ని శనివారం నిర్వహించారు. జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన 8 పరిశ్రమల ద్వారా సుమారు 54 వేల మందికి ఉపాధి కలగనుందని తెలిపారు. దరఖాస్తులను సింగిల్ విండో విధానంలో వేగంగా పరిశీలించి అనుమతులు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.

News December 27, 2025

జనవరి మొదటివారంలో సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభం: కలెక్టర్

image

జనవరి మొదటివారంలో సోలార్ రూఫ్ టాప్ పథకాన్ని ప్రారంభించాల్సిందిగా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో శనివారం సమీక్ష జరిపారు. జిల్లాలో ఈ పథకం అమలును మరింత వేగవంతం చేసి ప్రజలకు విస్తృతంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవగాహన కార్యక్రమాలు పెంచి, దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేయాలని, అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన లాభాలు అందేలా చూడాలన్నారు.