News June 9, 2024

విజయనగరంలో కూటమికి జైకొట్టిన ఉద్యోగులు

image

విజయనగరం MP స్థానంలో 22,301 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా 13,329(59.74%) ఓట్లు NDAకి పడ్డాయి. YCPకి 6,071(27.21%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 353(1.58%) మంది మాత్రమే ఓటు వేశారు. అరకు MP స్థానంలో 21,432 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా కూటమికి 9,312(43.44%) ఓట్లు పడ్డాయి. YCPకి 5,535(25.83%) ఓట్లు లభించగా.. ఇండియా కూటమికి 4,113(19.19%) మంది ఓటు వేశారు. రాష్ట్రంలో ఇండియా కూటమికి ఇదే అత్యధికం.

Similar News

News September 29, 2024

ఏయూ: ‘అక్టోబర్ 7 నుంచి దసరా సెలవులు’

image

ఏయూతో పాటు అనుబంధ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఈ.ఎన్ ధనుంజయ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 7 (సోమవారం) నుంచి 12(శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 14(సోమవారం) తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

News September 29, 2024

విజయనగరం: ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

image

పూసపాటిరేగ మండలం కొప్పెర్ల గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన లంకలపల్లి దుర్గారావు(39) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఎన్.ఏం.ఆర్‌గా పనిచేస్తున్న దుర్గారావు మానసిన సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 29, 2024

సౌర విద్యుత్‌పై అవగాహన కల్పించాలి: VZM జేసీ

image

ప్ర‌తీ ఇంట్లో సౌర విద్యుత్ వినియోగించుకొనే విధంగా వినియోగ‌దారుల‌ను చైత‌న్య‌ప‌ర‌చాల‌ని జేసీ ఎస్‌.సేతుమాధ‌వ‌న్ కోరారు. దీనికోసం కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పీఎం సూర్య‌ఘ‌ర్ యోజ‌న ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఈ ప‌థ‌కం అమ‌లుపై శ‌నివారం సంబంధిత శాఖ‌ల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. మండ‌లాల వారీగా ప‌థ‌కం అమ‌లును స‌మీక్షించారు.