News July 23, 2024

విజయనగరంలో జాబ్ మేళా

image

విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఈనెల26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి డి.అరుణ వెల్లడించారు. అభ్యర్థుల వయస్సు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలని, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.17 నుంచి రూ.19 వేల వ‌ర‌కు జీతం, ఈ.ఎస్.ఐ., పి.ఎఫ్., మెడికల్, ఓ.టి. వంటి ఇతర సౌకర్యాలను వర్తింపజేస్తారన్నారు. స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులన్నారు.

Similar News

News December 9, 2025

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధి హమీ పథకం కీలకం: మంత్రి కొండపల్లి

image

MGNREGS పనుల అమలుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన ఛాంబర్‌లో మంగళవారం సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఈ పథకం కీలకమని ఆయన పేర్కొన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ పనుల పురోగతి, బిల్లుల చెల్లింపుల స్థితిని అధికారులతో సమీక్షించారు. సమావేశంలో పీడీ శారదాదేవి, ఎస్ఈ శ్రీనివాస్, ఈఈ రత్నకుమార్, రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

News December 9, 2025

VZM: కలెక్టర్‌కు CPS ఉద్యోగుల వినతి పత్రం అందజేత

image

విజయనగరం జిల్లా CPS ఉద్యోగులు తమ డిమాండ్లపై కలెక్టర్‌కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిన్నర కావచ్చనా CPS ఉద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని వారు పేర్కొన్నారు. తక్షణమే CPS రద్దు చేయాలని, గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయాలని, డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా”చైతన్య యాత్ర”నిర్వహిస్తున్నామని బాజీ పటాన్ చెప్పారు.

News December 9, 2025

VZM: జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయ సహాయ కేంద్రం ప్రారంభం

image

ప్రపంచ మానవహక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా కోర్టు ప్రాంగణంలో బుధవారం తాత్కాలిక న్యాయ సహాయ కేంద్రం ప్రారంభిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత మంగళవారం తెలిపారు. ప్రజలకు న్యాయ సహాయం, మానవహక్కులపై అవగాహన కల్పించడం ప్రధాన ఉద్దేశ్యంగా ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా చూడడం, అవసరమైన సలహాలు అందించడం కార్యక్రమ లక్ష్యం అని చెప్పారు.