News November 23, 2024
విజయనగరంలో నేటి నుంచి T20 .. షెడ్యూల్ ఇదే

స్థానిక PVG రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సయ్యద్ ముస్తాక్ అలీ క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు ACA అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం నుంచి ఉదయం 11 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి రోజు అస్సాం–రైల్వేస్, 25న ఒడిస్సా–రైల్వేస్, 27న విదర్భ–పుదిచ్చేరి, 29న చండీగఢ్–ఛత్తీస్గఢ్, డిసెంబర్1న అస్సాం–పుదిచ్చేరి, 3న ఛత్తీస్గఢ్–విదర్భ, 5న చండీగఢ్–ఒడిశా జట్ల మధ్య మ్యాచ్లు జరగనున్నాయి.
Similar News
News September 14, 2025
VZM: ‘గాలికుంటు వ్యాధిని నిరోధించండి’

విజయనగరం జిల్లాలో గాలికుంటు వ్యాధిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించే గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను తన చాంబర్లో శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా నెలరోజులపాటు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పశువులకు వేయడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చన్నారు.
News September 13, 2025
VZM: ‘షరతులు లేకుండా వాహన మిత్ర అమలు చేయాలి’

వాహన మిత్ర సంక్షేమ పథకంలో ఎలాంటి షరతులు లేకుండా ఆటో, మ్యాక్సీ, టాక్సీ, జీపు, టాటా మ్యాజిక్ డ్రైవర్లందరికీ అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. విజయనగరంలోని బుచ్చన్న కోనేరు వద్ద కార్మికులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నెలకు 5వేల పింఛన్తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
News September 13, 2025
మందు బాబులకు భారీగా జరిమానాలు: VZM SP

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై భారీగా జరిమానాలను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. మొత్తం 85 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.8.50 లక్షల జరిమానాను విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తేజ చక్రవర్తి తీర్పు చెప్పారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఇతరులకు కూడా నష్టాన్ని కలిగిస్తున్నారన్నారు.