News August 25, 2024

విజయనగరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

image

ఆగష్టు 26న కృష్ణాష్టమి సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఉత్తర్వులు జారీ చేయడంతో విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతీ సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి నిర్వహించే “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (గ్రీవెన్స్ సెల్) రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News January 20, 2026

VZM: ప్రేమ పేరుతో బాలికను మోసం.. 20 ఏళ్ల జైలు

image

ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను మోసం చేసిన కేసులో నిందితుడికి పోక్సో ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. రూ.3,000 జరిమానాతో పాటు బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని మంగళవారం తీర్పునిచ్చింది. బొబ్బిలి (M) గొల్లపల్లి గ్రామానికి చెందిన సింగారపు అజయ్ అనే యువకుడు బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని తేలడంతో శిక్ష ఖరారైందని SP దామోదర్ తెలిపారు.

News January 20, 2026

‘అర్హులందరికీ ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పింఛన్లు వర్తింపజేయాలి’

image

జిల్లాలో అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులకు సంబంధించిన ఎస్‌వైఎం, ఎన్‌పీఎస్ పథకాలను అర్హులందరికీ వర్తింపజేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే ఆ పథకాలకు జిల్లాలో 9,300 దరఖాస్తులు వచ్చాయని సోమవారం తెలిపారు. మార్చిలోగా 15 వేల మందికి మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ఆదేశించారు.

News January 20, 2026

VZM: 26 నుంచి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన స్పెషల్ డ్రైవ్

image

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఈ నెల 26 నుంచి మార్చి 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం సూచించారు. ఇందుకోసం జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేయాలని, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు కూడా భాగస్వాములుగా పనిచేయాలన్నారు. హోటళ్లు, దుకాణాలు, వ్యవసాయ రంగాల్లో బాల కార్మికులపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.