News December 30, 2024
విజయనగరంలో ప్రారంభమైన కానిస్టేబుల్ పీఈటీ టెస్టులు

పోలీస్ నియామకాలకు సంబంధించి అభ్యర్థులు పీఎంటీ, పీఈటీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు విజయనగరం పోలీస్ గ్రౌండ్లో జరుగుతున్న ఎంపికలను జిల్లా ఎస్పీ రకుల్ జిందాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రన్నింగ్, లాంగ్ జంప్, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎంపికైన వారికి త్వరలో రాత పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఎవరినీ నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా కోరారు.
Similar News
News November 18, 2025
మెరకముడిదాం : ఉపాధ్యాయుడుని సత్కరించిన విజయనగరం ఎంపి

మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు మరడాన సత్యారావుని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం సత్కరించారు. 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను పదవతరగతి విద్యార్థులను విమానం ఎక్కించినందుకు సత్యారావుని ఎంపి అభినందించారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న విద్యార్థులను విమానం ఎక్కిస్తానని సత్యారావు తెలిపారు.
News November 18, 2025
‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్సైట్కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.
News November 18, 2025
‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్సైట్కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.


