News February 14, 2025
విజయనగరంలో మంత్రి గన్ మెన్ బ్యాగ్ మిస్సింగ్

విజయనగరంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వద్ద గన్ మెన్గా పనిచేస్తున్న ఏఆర్ హెచ్సీ వెంకటరమణ బ్యాగ్ మిస్సింగ్ కలకలం రేపింది. బుధవారం రాత్రి కణపాక వెళ్లే రహదారి వద్ద బ్యాగ్ను ఆటోలో పెట్టి జిరాక్స్ తీసేందుకు వెళ్లగా తన బ్యాగ్ మిస్ అయినట్లు వన్ టౌన్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. బ్యాగులో బుల్లెట్ మ్యాగ్జిన్, 30 బుల్లెట్లు మిస్ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. CI శ్రీనివాస్ దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 19, 2025
మద్నూర్: హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్ట్

హత్యాయత్నం కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బిచ్కుంద CI రవికుమార్ వివరాలు.. మద్నూర్ PS పరిధి సిర్పూర్ శివారులో మహారాష్ట్రకు చెందిన వారు అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామస్థులు ఫరూక్ సహా ఐదుగురు వారిని అడ్డుకున్నారు. నిందితులు వారిపై దాడి చేయగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని CI వెల్లడించారు.
News October 19, 2025
మంచిర్యాల: లక్కీ డ్రా పద్ధతిన విద్యార్థుల ఎంపిక

జిల్లాలోని గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లక్కీ డ్రా పద్ధతిన ఎంపిక చేసి భర్తీ చేయడం జరిగిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రాఫ్ ఖాన్ తెలిపారు. జిల్లాలోని గురుకుల బాలికల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 74 సీట్లు ఖాళీగా ఉండగా 37సీట్లను భర్తీ చేయడం జరిగిందని, బాలుర పాఠశాలలో 89సీట్లకు 38సీట్లను భర్తీ చేయడం జరిగిందన్నారు.
News October 19, 2025
ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు దగా చేశారు: వైసీపీ నేతలు

AP: ప్రభుత్వ <<18045253>>ఉద్యోగులను<<>> చంద్రబాబు మరోసారి దగా చేశారని వైసీపీ మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్, మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. 4 డీఏలు పెండింగ్లో ఉంటే ఒకటే చెల్లిస్తామని ప్రకటించారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. తమపై విమర్శలు తప్ప, కూటమి ప్రభుత్వం సామాన్యులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏమి చేయట్లేదన్నారు.