News October 15, 2024

విజయనగరంలో NO.1 అదృష్టవంతులు వీళ్లే..!

image

మద్యం షాపుల లాటరీలో ఈ ముగ్గురు అదృష్టవంతులనే చెప్పాలి. ఆయా మద్యం షాపులకు మొదటి దరఖాస్తు సమర్పించిన ముగ్గురికి లాటరీలో షాపులు దక్కాయి. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో తొలి టెండర్ వేసిన కనకల కృష్ణ, చీపురుపల్లిలో నామాల గణపతి, గజపతిగరంలో కుమిలి శ్రీనుకు టోకెన్ నంబర్లు 1గా కేటాయించారు. అనూహ్యంగా లాటరీలో సైతం వీళ్ల టోకనే రావడంతో షాపులు వారికే ఇచ్చారు. ఈ ముగ్గురి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Similar News

News October 20, 2025

ప్రమాదాలు జరిగితే ఈ నంబర్లకు కాల్ చేయండి: SP

image

మతాబులు కాల్చేటప్పుడు ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ దామోదర్ ఆదివారం సూచించారు. చిన్నపిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే మతాబులు కాల్చాలని, పాత లేదా తడిసిన మతాబులు వినియోగించరాదని చెప్పారు. కాటన్ దుస్తులు ధరించాలనీ, నైలాన్ లేదా సింథటిక్ దుస్తులు ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే 101, 100, 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News October 20, 2025

ప్రతి కుటుంబానికి రూ.15వేల లబ్ది: కలెక్టర్

image

జిల్లాలో సుమారు నెల రోజులుగా కొనసాగిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ప్రజలలో విశేష స్పందన వచ్చిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదివారం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆవిష్కరణగా ప్రారంభమైన ఈ పథకం ద్వారా నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులకు తగ్గించడంతో 98 శాతం ఉత్పత్తులు ధరలు తగ్గాయని తెలిపారు. పారదర్శక పన్ను విధానం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం రూ. 15 వేలు లబ్ది చేకూరుతుందన్నారు.

News October 19, 2025

బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలి: ఎస్పీ

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజలు బహిరంగ ప్రదేశాలలో బాణాసంచా పేల్చాలని ఎస్పీ ఎఆర్ దామోదర్ కోరారు. దీపావళి సందర్బంగా ఆదివారం జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు నివారించాలని కోరారు. బాణాసంచాకు చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి లేదా పెద్దల పర్యవేక్షణలో కాల్చాలని కోరారు. కాటన్ దుస్తులను ధరించి మతాబులు కాల్చాలన్నారు. మతాబులు కాల్చిన తర్వాత వ్యర్దాలు సురక్షితమైన ప్రదేశాలలో వేయాలన్నారు.