News May 22, 2024

విజయనగరం: ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఎస్పీ

image

విజయనగరం ఎస్పీ దీపిక ఎం.పాటిల్ ఈవీఎంలను భద్రపరిచిన ఇంజినీరింగ్ కళాశాల వద్ద కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వుడు, సివిల్ పోలీసుల మూడంచెల భద్రతను మంగళవారం తనిఖీలు నిర్వహించారు. కళాశాలకు వెళ్లే మార్గాల వాహనా తనిఖీలు పర్యవేక్షించారు. అంతేకాకుండా ఆయా మార్గాల వెళ్లే వాహనాల వ్యక్తుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేస్తామన్నారు. ఈవిఎంల భద్రతను అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైల పర్యవేక్షణలో ఉంటుందన్నారు

Similar News

News November 26, 2025

VZM: రేపు డయల్ యువర్ ఆర్టీసీ డీపీటీవో కార్యక్రమం

image

డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు విజయనగరం ఆర్టీసీ డిపో ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. కాంప్లెక్స్ డీపీటీవో కార్యాలయంలో ఉదయం 11 గంటలు నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీపీటీవో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. డిపో పరిధిలో గల ప్రయాణికులకు ఎటువంటి సమస్యలున్నా, సలహాలు ఉన్న నం.9959225604 ద్వారా తెలిపి నివృత్తి చేసుకోవాలని కోరారు.

News November 26, 2025

గడ్డిమందు తాగి మహిళ మృతి: గజపతినగరం ఎస్ఐ

image

గజపతినగరం మండలం భూదేవిపేటకి చెందిన జగ్గినేని గౌరీ (43) కడుపునొప్పి కారణంగా ఈనెల 25 సాయంత్రం గడ్డి మందు తాగిందని గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. ఆమెను చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు కుమార్తె డొంక పూజిత ఫిర్యాదు చేసిందన్నారు.గౌరి మృతిపై కుటుంబ సభ్యులకు కొన్ని అనుమానాలు ఉన్నాయని వాటిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News November 26, 2025

విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

image

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.