News March 24, 2024
విజయనగరం: ఆ రెండు స్థానాల్లో వీడని ఉత్కంఠ..!

విజయనగరం ఎంపీ, చీపురుపల్లి ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత ఎంపీ టికెట్ బీజేపీకి వెళ్తుందనే ప్రచారం సాగింది. తాజాగా విజయనగరం సీటు టీడీపీకి కేటాయిస్తారని వార్తలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహుల్లో ఒకరైన మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ ఇప్పటికే చంద్రబాబు వద్దకు వెళ్లినట్లు సమాచారం.
Similar News
News February 6, 2026
విజయనగరం రైల్వే స్టేషన్లో డార్మిటరీ, రిటైరింగ్ రూమ్ సదుపాయం

విజయనగరం రైల్వే స్టేషన్లో డార్మిటరీ, రిటైరింగ్ రూమ్ సదుపాయం శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా మాట్లాడుతూ.. ప్రయాణికుల సౌకర్యం కోసం అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. కన్ఫర్మ్ అయిన పీఎన్ఆర్ ఉన్న ప్రయాణికులకే ఈ సదుపాయం లభిస్తుందన్నారు. బుకింగ్స్ అన్నీ ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చేయాల్సి ఉంటుందన్నారు.
News February 6, 2026
విజయనగరంలో పోస్టాఫీస్ ఉద్యోగాలు.. ఖాళీలు ఇవే

విజయనగరం, పార్వతీపురం మన్యం డివిజన్ల పరిధిలోని సీతానగరం, కురుపాం, పెదబొండపల్లి, భీమసింగి, భోగాపురం తదితర 66 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <
News February 6, 2026
VZM: ఈ నెల 7న 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ పర్యటన

ఈ నెల 7న 20 సూత్రాల కమిటీ ఛైర్మన్ లంక దినకర్ జిల్లాలోని పలు ప్రాంతాలలో పర్యటించనున్నారు. శుక్రవారం రాత్రి 9:30 గంటలకు విజయనగరం చేరుకుని బస చేస్తారు. శనివారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల అమలుపై సమీక్షిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు పత్రికా సమావేశం, 2:30లకు NDA నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి విశాఖకు వెళ్తారని జిల్లా సమాచార శాఖ గురువారం తెలిపింది.


