News February 3, 2025

విజయనగరం: కుంభామేళా నుంచి వస్తూ టీచర్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో టీచర్ చనిపోయిన విషాద ఘటన ఇది. విశాఖ నగరంలోని పీఎంపాలేనికి చెందిన సౌజన్య భోగాపురం(M) పోలిపల్లి స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నారు. కుంభామేళా కోసం కారులో వెళ్లారు. తిరిగి వస్తుండగా పూసపాటిరేగ(M) కనిమెల్ల జంక్షన్ సమీపంలో ఆదివారం అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. టీచర్ అక్కడికక్కడే చనిపోగా ఆమె భర్త, కారు డ్రైవర్ గాయపడ్డారు.

Similar News

News March 9, 2026

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్?.. మస్క్ రియాక్షన్ ఇదే

image

సూరత్‌(గుజరాత్‌)లో షాకింగ్ ఘటన జరిగింది. ‘ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడాలి?’ అని ChatGPTలో అడిగి ఇద్దరు అమ్మాయిలు(18, 20ఏళ్లు) సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి Xలో పోస్టు చేయగా ఎలాన్ మస్క్ yikes(ప్రమాదకరం, షాకింగ్) అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ChatGPT, Gemini Ai సూసైడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని పలువురు గుర్తుచేస్తున్నారు.

News March 9, 2026

అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 124 మంది గైర్హాజర్

image

ఉమ్మడి అల్లూరి జిల్లాలో సోమవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 124 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. ఆరు పరీక్ష కేంద్రాల్లో ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. అల్లూరి జిల్లాలో 504 మందికి గాను 459 మంది రాశారని, పోలవరం జిల్లాలో 504కి గాను 459 మంది రాశారని తెలిపారు. చింతూరు ZPHS పరీక్ష కేంద్రాన్ని ఏజెన్సీ DEO మల్లేశ్వరావు తనిఖీ చేశారు.

News March 9, 2026

విజయ్‌కి మరోసారి సీబీఐ నోటీసులు

image

కరూర్ తొక్కిసలాట ఘటనపై టీవీకే చీఫ్ విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రేపు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనవరి 12, 19వ తేదీల్లో సీబీఐ ఆయనను విచారించింది.