News March 11, 2025

విజయనగరం జిల్లాలో ఈ మండలాల్లో ప్రజలు జాగ్రత్త

image

జిల్లాలోని 16 మండలాల్లో మంగళవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు APSDMA తెలిపింది. బాడంగి(39.3), బొబ్బిలి(39.3), బొండపల్లి(37.8), దత్తిరాజేరు(38.6), గజపతినగరం(38.2), గంట్యాడ(37.3), గరివిడి(39.3), గుర్ల(37.7), మెంటాడ(38.1), మెరకముడిదాం(38.9), రాజాం(39.6), రామభద్రపురం(38.7), రేగిడి ఆముదాలవలస(40.3), సంతకవిటి(39.5), తెర్లాం(39.8), వంగర(40.4) డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Similar News

News March 15, 2025

ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం కృషి: మంత్రి

image

విజయనగరం మహిళా ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సర్కులర్ ఆక్వా కల్చర్ విధానాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. మహిళల జీవనోపాధిని పెంచేందుకు ఇదో కొత్త అవకాశమన్నారు. వెలుగు 2.0 ద్వారా రాష్ట్రంలోని మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, ఈ అవకాశాన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

News March 15, 2025

VZM: కన్న తండ్రి ముందే విషం తాగి మృతి

image

దొంగతనం నింద తనపై మోపారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు కన్న తండ్రి ముందే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భోగాపురం మండలం అమకాంలో ఈనెల 11న చోటుచేసుకోగా సదరు యువకుడు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో పనిచేస్తున్న అప్పలనాయుడు.. టూరిస్ట్ సెల్ ఫోన్ దొంగలించాడని యాజమాన్యం నిందించడంతో అవమానంగా బావించి పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.

News March 15, 2025

VZM: ఇంకా ఒక్కరోజే టైం.. ALL THE BEST

image

పదో తరగతి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 23,765 మంది విద్యార్థులు 119 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. 1150 మంది ఇన్విజిలేటర్లు, 9మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 36 మంది కస్టోడియన్లు, 238 మంది డిపార్టమెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష జరగనుండగా.. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవచ్చు.
ALL THE BEST

error: Content is protected !!