News March 7, 2025
విజయనగరం జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. ప్రజలు విజయనగరం నుంచి ఎక్కువగా విశాఖకు వెళ్తుంటారు. విశాఖలో ఇంజినీరింగ్ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విశాఖకు వెళ్లాలంటే టికెట్ కొనాల్సి ఉంటుంది. ఇలా జిల్లా బార్డర్లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News March 21, 2025
VZM: నకిలీ బంగారం ముఠా అరెస్ట్

కైకలూరులో గోల్డ్ షాపుల్లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెడుతున్న ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా మెంటాడకి చెందిన CH మణికంఠ మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు పాల్పడ్డాడు. ఓ షాప్లో బంగారు నగలు అని తాకట్టు పెట్టి రూ.90,000 తీసుకున్నారు. మరో షాప్లో కూడా ఇలానే చేయగా షాప్ యజమానికి అనుమానం వచ్చి ప్రశ్నించాడు. దీంతో నిందితులు చాకు చూపించి రూ.1,50,000తో పరారైనట్లు కేసు నమోదు అయ్యింది.
News March 21, 2025
VZM: ఇళ్ల లబ్దిదారులకు ఉచితంగా ఇసుక: కలెక్టర్

ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం అందిస్తున్న అదనపు సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అంబేడ్కర్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు. అదనంగా ఆర్ధిక సాయం చేయడమే కాకుండా, ఇసుకను కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తోందన్నారు. లబ్దిదారులు వీటిని వినియోగించుకొని సకాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి అనుకూలమైన సమయమని చెప్పారు.
News March 20, 2025
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో బేబినాయన భేటీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన గురువారం భేటీ అయ్యారు. అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను విన్నవించారు. బాడంగి మండలం గొల్లాదిలో వేగవతి నదిపై వంతెన ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పామని వంతెన నిర్మాణానికి సహకరించాలని కోరారు. వంతెన నిర్మాణం పూర్తయితే నిర్మాణం వలన బాడంగి, రాజాం, దత్తిరాజేరు, మెరకముడిదాం గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.