News February 26, 2025
విజయనగరం జిల్లాలో రేపు అన్ని పాఠశాలలకు సెలవు

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా విజయనగరం జిల్లాలో గల అన్ని యాజమాన్య పరిధిలోని ఉన్నత పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు DEO యు.మాణిక్యం నాయుడు బుధవారం తెలిపారు. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు తమ పరిధిలో గల అన్ని ఉన్నత పాఠశాలలు సెలవు ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 29 పాఠశాలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నట్లు ఆయన చెప్పారు.
Similar News
News March 25, 2025
నెల్లిమర్ల: నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు స్కిల్బీ సంస్థ ప్రతినిధి ఉజ్వల్ తెలిపారు. నెల్లిమర్ల MIMSలో నర్సింగ్ విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ప్రభుత్వ సహకారంతో ఎనిమిది నెలల శిక్షణ అనంతరం జర్మనీలో రూ.2.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
News March 25, 2025
బొబ్బిలిలో విషాదం.. అపార్ట్మెంట్పై నుంచి పడి రిటైర్డ్ HM మృతి

బొబ్బిలిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. నాయుడుకాలనీలో అపార్ట్మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తూ జారిపడి రిటైర్డ్ హెచ్ఎం వై.శ్యామసుందర్(80) మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బాల్కనీలో నిల్చున్న ఆయన కళ్లు తిరిగి పడిపోయారు. ఆయన స్వగ్రామం పాల్తేరు కాగా అదే గ్రామంలో HMగా రిటైర్ అయ్యారు. ఇద్దరు కుమారులు కాగా.. ఒకరు డాక్టర్గా, మరో కుమారుడు సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
News March 25, 2025
విశాఖలో ఐపీఎల్ మ్యాచ్.. వారికి తీపి జ్ఞాపకం

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ 30 మంది అనాథ చిన్నారులకు చూసే అవకాశం కల్పించింది. సొంత నిధులతో 30 టికెట్స్ కొని వైజాగ్లోని పాపా హోమ్ అనాథ శరణాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు చిన్నారులు స్టేడియానికి వెళ్లారు.