News March 14, 2025
‘విజయనగరం జిల్లా రైతులకు రూ.2.5కోట్ల రాయితీ’

విజయనగరం జిల్లాలో అర్హులైన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం రూ.2.5కోట్లు సబ్సిడీ ఇవ్వనుందని జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు చెప్పారు. గురువారం తెర్లాం వచ్చిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. స్ప్రింక్లర్లు, పవర్ స్ప్రింక్లర్లు, రోటోవీటర్లు, ట్రాక్టర్ పరికరాలు 50 శాతం రాయితీపై అందజేయనున్నారు. రైతులు వ్యవసాయ అధికారులు ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News November 17, 2025
విజయనగరం జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు: మంత్రి

రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో ధాన్యం సేకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ధాన్యం సేకరణకు జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలను, 261 క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెల్లింపులు 48 గంటల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం నెంబర్ 8978975284 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
News November 17, 2025
విజయనగరం జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలు: మంత్రి

రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో ధాన్యం సేకరణ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ధాన్యం సేకరణకు జిల్లాలో 382 కొనుగోలు కేంద్రాలను, 261 క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. చెల్లింపులు 48 గంటల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం నెంబర్ 8978975284 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
News November 16, 2025
1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

అర్జీదారులు ‘మీ కోసం కాల్ సెంటర్ 1100’ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చని సూచించారు.


