News March 20, 2025
విజయనగరం జిల్లా వాసులకు అలెర్ట్

విజయనగరం జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. 15 మండలాల్లో సుమారు 40 °C టెంపరేచర్ నమోదు కానుండగా.. 20 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. వంగరలో 40.6°C, తెర్లాంలో 40.5°C, రామభద్రపుర, రేగిడి ఆమదాల వలసలో 40.2, మెరకముడిదాంలో 40, గజపతినగరం, రాజాంలో 39.9, గంట్యాడలో 39.7, సంతకవిటిలో 39.6, గరవిడిలో 39.5, గుర్లలో 39.3, విజయనగరంలో 38.5°C గా నమోదవుతాయి.
Similar News
News March 21, 2025
VZM: ఇంగ్లిష్ పరీక్షకు 98 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో 119 పరీక్షా కేంద్రాలలో జరుగుతున్న 10 వతరగతి పరీక్షలలో శుక్రవారం ఇంగ్లిష్ పరీక్షకు 98 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ యు.మాణిక్యం నాయుడు తెలిపారు. 22,846 విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 22,748 మంది పరీక్ష రాశారన్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయని.. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు.
News March 21, 2025
మానాపురం ROB పనులపై కలెక్టర్ సీరియస్

మానాపురం ROB నిర్మాణం ఆలస్యం అయినందున కాంట్రాక్టర్కు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. నోటీసు అందిన రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని, లేనిచో చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పనుల ఆలస్యం వలన ట్రాఫిక్ సమస్యతో పాటు పబ్లిక్కు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు.
News March 21, 2025
VZM: నకిలీ బంగారం ముఠా అరెస్ట్

కైకలూరులో గోల్డ్ షాపుల్లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెడుతున్న ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా మెంటాడకి చెందిన CH మణికంఠ మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు పాల్పడ్డాడు. ఓ షాప్లో బంగారు నగలు అని తాకట్టు పెట్టి రూ.90,000 తీసుకున్నారు. మరో షాప్లో కూడా ఇలానే చేయగా షాప్ యజమానికి అనుమానం వచ్చి ప్రశ్నించాడు. దీంతో నిందితులు చాకు చూపించి రూ.1,50,000తో పరారైనట్లు కేసు నమోదు అయ్యింది.