News July 17, 2024
విజయనగరం: తేలు కరిచిన కొన్ని గంటలకే మృతి

గుర్ల మండలం పున్నపురెడ్డిపేటకి చెందిన పున్నపురెడ్డి కనక నాయుడు అనే వ్యక్తి తేలు కాటుకు గురై మృతి చెందాడు. పొలంలో పని చేస్తుండగా తేలు కరిచిందని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు గంటల తరువాత చికిత్స పొందుతూ చనిపోయాడని గ్రామస్థులు తెలిపారు. ఇదిలా ఉంటే సంవత్సరం క్రితం అదే పొలంలో మృతుడి చిన్న కూతురు ఏదో విషపురుగు కరిచి చనిపోయింది. ఇప్పుడు మరొకరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 18, 2025
జిల్లాలో 2,645 హెక్టార్లలో ఆయిల్ ఫాం సాగు: కలెక్టర్

జిల్లాలో ప్రస్తుతం 2,645 హెక్టార్ల విస్తీర్ణంలో అయిల్ పామ్ సాగు అవుతుందని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరం రూరల్ మండలం కొండకరకాంలో సాగు అవుతున్న ఆయిల్ పామ్ తోటను కలెక్టర్ సందర్శించారు. 2025-26 సంవత్సరానికి 26 మండలాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా గుర్తించడం జరిగిందని 1850 హెక్టార్లు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. శత శాతం రాయితీతో మొక్కలు పంపిణీ చేస్తామన్నారు.
News October 18, 2025
VZM: బాల సంరక్షణ కేంద్రాలకు ధ్రువపత్రాల పంపిణీ

బాలల సరంక్షణా కేంద్రాలకు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం ధృవప్రతాలను పంపిణీ చేశారు. జిల్లాలోని మూడు బాల సదనాలు, ఒక చిల్డ్రన్ హోమ్, ఒక శిశుగృహ హోమ్, 4 చైల్డ్ కేర్ ఎన్జిఓ హోమ్స్ కు ఫైనల్ సర్టిఫికెట్స్ అందజేశారు. జిల్లాలోని శిశు సంరక్షణ సంస్థలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడానికి ఈ జిల్లా స్థాయి తనిఖీ కమిటీ పనిచేస్తుందని ఆయన తెలిపారు.
News October 17, 2025
పుణ్యక్షేత్రాలకు విజయనగరం నుంచి ప్రత్యేక బస్సులు

కార్తీక మాసంలో భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని డిపో మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాల దర్శనానికి అక్టోబర్ 26, నవంబర్ 2, 9, 16 తేదీల్లో బస్సులు నడుస్తాయని, సూపర్ లగ్జరీ రూ.2000, అల్ట్రా డీలక్స్ రూ.1950గా చార్జీలు నిర్ణయించామన్నారు. టిక్కెట్లు www.apsrtconline.in లేదా సమీప డిపోలో లభ్యమన్నారు.