News May 24, 2024

విజయనగరం: తొమ్మిదేళ్ల బాలుడు మృతి

image

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగచోళ్ళపెంటకు చెందిన తామాడ అఖిల్ (9) గురువారం రోడ్డుప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా కేజీహెచ్‌లో చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు మండల SI మహేశ్ కుమార్ తెలిపారు.

Similar News

News November 7, 2025

VZM: సబ్సిడీ కింద సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు

image

సఫాయి కర్మచారి యువతకు NSKFDC పథకం కింద సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీనింగ్‌ వాహనాలు సబ్సిడీపై మంజూరు చేయనున్నట్లు SC కార్పొరేషన్‌ ED వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాకు కేటాయించిన మూడు వాహనాలకు కొత్త లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఐదుగురు సఫాయి కర్మచారులు కలిసి గ్రూపుగా దరఖాస్తు చేసుకోవాలని, వారిలో ఒకరికి హెవీ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలని సూచించారు. జిల్లా కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News November 7, 2025

వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి ప‌ని: VZM కలెక్టర్

image

ప్రతి మండలంలో కనీసం వెయ్యిమందికి తక్కువ కాకుండా ఉపాధి పనులు కల్పించాల‌ని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. MNREGS పథకం అమలుపై శుక్రవారం టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. తక్కువ ప్రగతి ఉన్న మండలాలపై దృష్టి సారించాలని సూచించారు. వచ్చే వారం నాటికి 20% పనులు ప్రారంభించాలని, సగటు వేతనాన్ని పెరిగేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు.పనికల్పనలో వెనుకబడిన మండలాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

News November 7, 2025

‘కూటమిగా పోరాడదాం.. మెంటాడను సాధిద్దాం’

image

మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో కొనసాగించేకు ఉమ్మడిగా పోరాడాలని జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అన్నారు. శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు సమావేశం అయ్యారు. మెంటాడ మండలం పార్వతీపురం జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. త్వరలో మండల ప్రజల అభిప్రాయాలను ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులకు తెలియజేస్తామన్నారు.