News May 24, 2024
విజయనగరం: తొమ్మిదేళ్ల బాలుడు మృతి

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగచోళ్ళపెంటకు చెందిన తామాడ అఖిల్ (9) గురువారం రోడ్డుప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా కేజీహెచ్లో చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు మండల SI మహేశ్ కుమార్ తెలిపారు.
Similar News
News February 13, 2025
తెర్లాం: వివాహేతర సంబంధమే హత్యకు కారణం?

తెర్లాం మండలం నెమలాంలో <<15434993>>సాఫ్ట్వేర్ ఉద్యోగి<<>> కె.ప్రసాద్ హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెమలాంకు చెందిన ఓ వివాహితతో ప్రసాద్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆమె భర్త, మరిది కలిసి హత్య చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు నిందితులు విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2025
రాజాం : తండ్రిని చూసేందుకు వెళ్లి దారిలో మృతి

రాజాం కాంప్లెక్స్ ఆవరణలో కాలువలో బుధవారం మెరకముడిదాంకి చెందిన మజ్జి రామకృష్ణ మృతి చెందిన విషయం <<15436428>>తెలిసిందే<<>>. శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తండ్రిని చూసేందుకు రామకృష్ణ రాజాం వచ్చాడు. కాంప్లెక్స్లో బైక్ ఉంచి బస్సులో వెళ్లాడు. రాత్రి తిరిగి కాంప్లెక్స్కి చేరుకున్నాడు. ఈక్రమంలో గుండెపోటు వచ్చి కాలువలో పడిపోగా ఎవరు చూడకపోవడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
News February 13, 2025
వంగర: ఉరి వేసుకొని వ్యక్తి మృతి

మెరకముడిదాంకు చెందిన శ్రీరాములు(52) చెడు వ్యసనాలకు బానిస అయ్యాడు. దీంతో వంగర మండలం చౌదరివలసలోని తన భార్య చెల్లెలు రమణమ్మ ఇంటికి వచ్చి ఆమెను డబ్బులు అడిగాడు. తను లేవని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం చౌదరివలస సమీప తోటలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.