News July 30, 2024

విజయనగరం బాలికపై అత్యాచారం..!

image

పశ్చిమ గోదావరి జిల్లాలో విజయనగరం జిల్లా బాలికపై అత్యాచారం జరిగినట్లు కేసు నమోదైంది. స్థానిక SI జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం యువకుడికి విజయనగరం బాలిక ఇన్‌స్టాలో పరిచయమైంది. అతడిని కలిసేందుకు JRG బస్టాండ్‌ వద్దకు వెళ్లింది. యువకుడు బాలికతో మాట్లాడి కాసేపట్లో వస్తానని వెళ్లిపోయాడు. వేగవరానికి చెందిన రాజు అనే మరొక వ్యక్తి బాలికను ఊరు పంపిస్తానని చెప్పి రూంలో ఉంచి అత్యాచారం చేశాడు.

Similar News

News November 18, 2025

మెరకముడిదాం : ఉపాధ్యాయుడుని సత్కరించిన విజయనగరం ఎంపి

image

మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు మరడాన సత్యారావుని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం సత్కరించారు. 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను పదవతరగతి విద్యార్థులను విమానం ఎక్కించినందుకు సత్యారావుని ఎంపి అభినందించారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న విద్యార్థులను విమానం ఎక్కిస్తానని సత్యారావు తెలిపారు.

News November 18, 2025

‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

image

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్‌ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్‌సైట్‌కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.

News November 18, 2025

‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

image

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్‌ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్‌సైట్‌కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.