News September 28, 2024

విజయనగరం: మద్యం తాగి వాహనాలు నడిపితే భారీ జరిమానాలు

image

మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జిల్లాలో నమోదు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 23 మందికి రూ.1.20 లక్షల జరిమానాను కోర్టు విధించిందని చెప్పారు. వీరిలో ఏడుగురికి రూ.10వేలు చొప్పున జరిమానా విధించారని చెప్పారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News November 18, 2025

మెరకముడిదాం : ఉపాధ్యాయుడుని సత్కరించిన విజయనగరం ఎంపి

image

మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు మరడాన సత్యారావుని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం సత్కరించారు. 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను పదవతరగతి విద్యార్థులను విమానం ఎక్కించినందుకు సత్యారావుని ఎంపి అభినందించారు. 2025 – 26 విద్యా సంవత్సరానికి చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న విద్యార్థులను విమానం ఎక్కిస్తానని సత్యారావు తెలిపారు.

News November 18, 2025

‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

image

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్‌ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్‌సైట్‌కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.

News November 18, 2025

‘మతిస్థిమితం లేని వ్యక్తుల వివరాలను అందించండి’: SP

image

జిల్లాలో రహదారులపై మతిస్థిమితం లేని నిరాశ్రయులకు సహాయం అందించేందుకు ‘మనోబంధు ఫౌండేషన్’ ముందుకు రావడం అభినందనీయమని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఫౌండేషన్ వాల్ పోస్టర్‌ను ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను www.manobhandhu.org వెబ్‌సైట్‌కి పంపించాలని ఆయన కోరారు. రెడ్ క్రాస్ సహకారంతో బాధితులను హోంలకు తరలించి చికిత్స అందించనున్నట్లు తెలిపారు.